
పోటీ ప్రపంచంలో ఐఓటీకి ప్రత్యేక స్థానం
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్) ప్రత్యేక స్థానం సంతరించుకుందని వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ డా.రవికిషోర్ పేర్కొన్నారు.
రాజంపేట: ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఐఓటీ(ఇంటర్నెట్ ఆఫ్ థింగ్) ప్రత్యేక స్థానం సంతరించుకుందని వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ డా.రవికిషోర్ పేర్కొన్నారు. సోమవారం ఏఐటీఎస్ (అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల)లో ఐఓటీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఓటీ ద్వారా ఆసుపత్రిలో అందే వైద్యసేవలు తెలుసుకోవచ్చన్నారు. వరంగల్ ఎన్ఐటీ ప్రొఫెసర్ డా.బీ.లక్ష్మీ మాట్లాడుతూ ఐఓటీ పరిజ్ఞానంపై పట్టు సాధించగలిగితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని తెలిపారు. సదస్సు నిర్వహణాధికారి డా.సుబ్రమణ్యం మాట్లాడుతూ ఐఓటీ టెక్నాలజీ వివిధ కోణాలలో విస్తరించిందన్నారు. ఈ టెక్నాలజీ ద్వారా వస్తువుల వినియోగాన్ని సులభతరంగా తెలుసుకోవచ్చన్నారు. డైరక్టరు ప్రభాకరరావు, కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఐఓటీ సాంకేతిక విద్యకు అనుగుణంగా సిలబస్ను ఆకలింపు చేసుకోవాలన్నారు. ఐఓటీపై దృష్టి సారిస్తే మంచి ప్రాజెక్టులను తయారు చేసుకోవచ్చునన్నారు. ఏఐటీఎస్ ఈడీ చొప్పా అభిషేక్రెడ్డి మాట్లాడుతూ ఐటీ సమాజం చుట్టూ తిరుగుతోందన్నారు. మారుతున్న సమాజంలో ఐఓటీ ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యార్థులు రోజురోజుకు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పాయల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.