నేడు విశాఖ రానున్న రాష్ట్రపతి, ప్రధాని | international fleet review celebrations | Sakshi
Sakshi News home page

నేడు విశాఖ రానున్న రాష్ట్రపతి, ప్రధాని

Feb 5 2016 8:31 AM | Updated on Aug 15 2018 2:20 PM

ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ప్రారంభోత్సవ వేడుకలు శుక్రవారం ఐఎన్ఎస్ శాతవాహన కమాండ్ స్టేడియంలో జరగనున్నాయి.

విశాఖపట్నం: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకలు శుక్రవారం ఐఎన్ఎస్ శాతవాహన కమాండ్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ వేడుకలకు  రాష్ట్ర గవర్నర్ నరసింహన్ హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ నేడు రాత్రి విశాఖ చేరుకోనున్నారు. ఈ వేడుకలకు దేశవిదేశాల నుంచి 11 వేల నేవీ ప్రతినిధులు హాజరుకానున్నారు. శనివారం జరిగే తూర్పు నౌకాదళ సమీక్షలో రాష్ట్రపతి పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి ప్రధాని గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.

ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు. వీఐపీల రాక సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సింథియా నుంచి కాన్వెంట్ జంక్షన్ వరకు వాహనాలను నిషేధించారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు, శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఆంక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement