అనుమానంతో భార్యను చంపిన భర్త | Husband kills wife | Sakshi
Sakshi News home page

అనుమానంతో భార్యను చంపిన భర్త

Apr 21 2016 11:04 AM | Updated on Apr 8 2019 8:07 PM

అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త.

అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో పెళ్లకోగిళ్ల గ్రామానికి చెందిన శివానంద, అలివేలమ్మ(30) దంపతులకు పదేళ్లలోపున్న ఇద్దరు కుమారులున్నారు.

అయితే, భార్యపై శివానంద అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆమెను బుధవారం సాయంత్రం గొంతుపిసికి చంపేశాడు. గురువారం ఉదయం శాంతిపురం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. వారి నివాసం గ్రామానికి దూరంగా ఉండటంతో అతడు వచ్చి చెప్పేదాకా ఈ దారుణం ఎవరికీ తెలియలేదు. ఈ మేరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement