క్రైస్తవ ప్రచారాన్ని అడ్డుకున్న హిందూ సంస్థలు | Sakshi
Sakshi News home page

క్రైస్తవ ప్రచారాన్ని అడ్డుకున్న హిందూ సంస్థలు

Published Tue, Apr 26 2016 7:11 PM

Hindu Institutions have opposed the Christian campaign

నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట గ్రామంలో క్రైస్తవుల మత ప్రచారాన్ని హుందూ సంస్థల ప్రతినిధులు మంగళవారం అడ్డుకున్నారు. వేసవి సెలవులు కావడంతో క్రైస్తవులు గ్రామంలోని 20 మంది పిల్లలను చేరదీసి చర్చికి తీసుకెళ్లి బైబిల్ పాఠాలు బోధిస్తుండగా విషయం తెలిసిన హిందూ సంస్థల ప్రతినిధులు అడ్డుకున్నారు. పిల్లలను విడిపించి ఇళ్లకు పంపారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు చెప్పారు.

 

Advertisement
Advertisement