హైకోర్టు తీర్పు హర్షణీయం | highcourt judgement good | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పు హర్షణీయం

Aug 4 2016 7:34 PM | Updated on Sep 4 2017 7:50 AM

123 జీవోను కొట్టివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళ ఓ ప్రకటనలో తెలిపారు.

సాక్షి, సంగారెడ్డి: 123 జీవోను కొట్టివేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయం హర్షణీయమని టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శశికళ ఓ ప్రకటనలో తెలిపారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూ సేకరణ ప్రభుత్వం 123 జీవో ప్రకారం చేపట్టిందన్నారు.  ప్రభుత్వం నిర్వాసితులు డిమాండ్లను పట్టించుకోకుండా మొండిగా 123 జీవో ప్రకారం భూ సేకరణ ప్రారంభించిందన్నారు. హైకోర్టు సైతం నిర్వాసితులకు నష్టంచేసే 123 జీవోను కొట్టివేసి 2013 చట్టం ప్రకారం భూములు సేకరించాలని చెప్పందన్నారు. ఇకనైనా ప్రభుత్వం పట్టుదలకు పోకుండా 2013 చట్టం ప్రకారం భూములు సేకరించి, నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement