పంట భూములను పరిశ్రమలకు అప్పగించం | Hand over the farmland for industry | Sakshi
Sakshi News home page

పంట భూములను పరిశ్రమలకు అప్పగించం

Sep 9 2016 12:52 AM | Updated on Sep 4 2017 12:41 PM

పరిశ్రమల స్థాపనకు ఎట్టి పరిస్థితుల్లోను తమ పంట భూములను అప్పగించేది లేదని మండలంలోని ఎలుకుర్తి, నర్సింగరావుపల్లి గ్రామాల రైతులు గురువారం ఎలుకుర్తి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు సంతకాలు కూడా సేకరించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపించాలని కోరుతూ రైతులు సర్పంచ్‌ గుండవరపు రాంచందర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. తమ భూములు ప్రభుత్వం బలవంతంగా లా

  • ∙ఆందోళన వ్యక్తం చేసిన ఎలుకుర్తి రైతులు 
  • ఎలుకుర్తి (ధర్మసాగర్‌) : పరిశ్రమల స్థాపనకు ఎట్టి పరిస్థితుల్లోను తమ పంట భూములను అప్పగించేది లేదని మండలంలోని ఎలుకుర్తి, నర్సింగరావుపల్లి గ్రామాల రైతులు గురువారం ఎలుకుర్తి గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు    సంతకాలు కూడా సేకరించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ తీర్మానం చేసి కలెక్టర్‌కు పంపించాలని కోరుతూ రైతులు సర్పంచ్‌ గుండవరపు రాంచందర్‌రావుకు వినతిపత్రం సమర్పించారు. తమ భూములు ప్రభుత్వం బలవంతంగా లాక్కోవాలని ప్రయత్నిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.  కార్యక్రమంలో రైతులు, స్థానికులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement