గ్రూప్‌–2 మెయిన్స్‌ వాయిదా వేయాలి | Group-2 mains shoud be postponed | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 మెయిన్స్‌ వాయిదా వేయాలి

May 2 2017 12:33 AM | Updated on Nov 9 2018 4:52 PM

గ్రూప్‌–2 మెయిన్స్‌ వాయిదా వేయాలి - Sakshi

గ్రూప్‌–2 మెయిన్స్‌ వాయిదా వేయాలి

ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షను వాయిదా వేయాలని ఐక్య విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు . జాతీయ రహదారిపై సోమవారం మోకాళ్లపై కూర్చొని మూడు గంటలపాటు నిరసన తెలిపారు.

ఎస్కేయూ:  ఏపీపీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్‌–2 మెయిన్స్‌  పరీక్షను వాయిదా వేయాలని ఐక్య విద్యార్థి సంఘం నాయకులు  డిమాండ్‌ చేశారు . జాతీయ రహదారిపై సోమవారం మోకాళ్లపై కూర్చొని మూడు గంటలపాటు  నిరసన తెలిపారు.   బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి జయపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. గ్రూప్‌–2 ప్రిలిమనరీ ఫలితాలు , మెయిన్స్‌ పరీక్షకు  కేవలం 40 రోజుల వ్యత్యాసం ఉండడంతో పరీక్షలకు సిద్ధమయ్యే   అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారన్నారు. మెయిన్స్‌కు నూతన సిలబస్‌ ఎక్కువగా నిర్ధేశించడంతో కాల వ్యవధి సరిపోలేదని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారన్నారు. వెంటనే పరీక్షను వాయిదా వేయాలన్నారు.  ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు జగదీష్, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు వీరు యాదవ్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు పులిరాజు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement