TG: గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట | TG: High Court Divisional Bench Suspends Single Bench Orders | Sakshi
Sakshi News home page

TG: గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట

Nov 27 2025 1:01 PM | Updated on Nov 27 2025 1:37 PM

TG: High Court Divisional Bench Suspends Single Bench Orders

హైదరాబాద్‌:  2015  ఏడాదికి సంబంధించి తెలంగాణ గ్రూప్ 2 మెరిట్‌ లిస్ట్‌ ర్యాంకర్లకు  హైకోర్ట్ లో  ఊరట లభించింది.  తెలంగాణ గ్రూప్‌-2 నియమాకాలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ ఇచ్చినx తీర్పును డివిజనల్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేసింది. అదే సమయంలో ఆ కేసు విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. 

మొన్నటి తీర్పు ఇలా..
తొమ్మిదిరోజుల కిందట దేళ్ల క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్‌–2 నియామకాలను రద్దు చేస్తూ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు గుర్తించే పార్ట్‌–బీలో ట్యాంపరింగ్‌ చేసిన వారిని కూడా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)ను ప్రశ్నించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ కమిషన్‌ను తప్పుబట్టింది. డబుల్‌ బబ్లింగ్, వైట్‌నర్, ఎరైజర్‌ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది. 2019లో వెల్లడించిన ఫలితాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం, సాంకేతిక కమిటీ సిఫారసులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియంతా 8 వారాల్లో పూర్తి చేయాలని తేల్చిచెప్పింది.  

పదేళ్ల క్రితం నోటిఫికేషన్‌ ఇచ్చి భర్తీ చేసిన గ్రూప్‌–2 నియామకాలను రద్దు చేస్తూ మంగళవారం హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు గుర్తించే పార్ట్‌–బీలో ట్యాంపరింగ్‌ చేసిన వారిని కూడా ఉద్యోగాలకు ఎలా ఎంపిక చేస్తారని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ)ను ప్రశ్నించింది. హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు, సాంకేతిక కమిటీ సిఫారసులకు విరుద్ధంగా నియామకాలు చేపట్టారంటూ కమిషన్‌ను తప్పుబట్టింది. డబుల్‌ బబ్లింగ్, వైట్‌నర్, ఎరైజర్‌ వినియోగించిన పత్రాల మూల్యాంకనం చెల్లదని స్పష్టం చేసింది. 2019లో వెల్లడించిన ఫలితాలు చట్ట విరుద్ధమని పేర్కొంది. హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం, సాంకేతిక కమిటీ సిఫారసులను పాటిస్తూ తిరిగి మూల్యాంకనం చేయాలని కమిషన్‌ను ఆదేశించింది. ఈ ప్రక్రియంతా 8 వారాల్లో పూర్తి చేయాలని తేల్చిచెప్పింది.  అయితే ఇప్పుడు ఆ తీర్పును హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలిచ్చింది. 

అసలు ఏం జరిగింది..?
 గ్రూప్‌–2 కింద 1,032 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ 2015లో నోటిఫికేషన్‌ జారీ చేసింది. తర్వాత 2016లో అనుబంధ నోటిఫికేషన్‌ జారీ చేయగా, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించారు. ప్రశ్నపత్రం బుక్లెట్, ఓఎంఆర్‌ షీట్లకు పొంతనలేవన్న ఆరోపణలు రావడంతో ప్రభుత్వం సాంకేతిక కమిటీని ఏర్పాటు చేసింది. బుక్లెట్‌ నంబర్, ఓఎంఆర్‌ నంబర్‌ ఒకటే ఉండాలని అభ్యర్థులు, ఇని్వజిలేటర్లు భావించడంతో ఈ గందరగోళం తలెత్తిందని కమిటీ 2017లో నివేదిక సమర్పించింది. పార్ట్‌–బీలో జవాబులకు ట్యాంపరింగ్, వైట్‌నర్‌ వాడితే ఆ పేపర్లను మూల్యాంకనం చేయవద్దని సిఫారసు చేసింది.  అనంతరం ఇది హైకోర్టుకు చేరింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement