మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.శ్యామలారాణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచాలని, ఉపాధి భద్రత కల్పించడంతో పాటు వారానికి మూడు గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలి
Oct 24 2016 10:27 PM | Updated on Jul 11 2019 5:40 PM
– మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకుల డిమాండ్
ఏలూరు (సెంట్రల్) : మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఏపీ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. యూనియన్ జిల్లా కార్యదర్శి ఎ.శ్యామలారాణి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు పెంచాలని, ఉపాధి భద్రత కల్పించడంతో పాటు వారానికి మూడు గుడ్లు ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. వారానికి మూడు గుడ్లు పెట్టాలని అధికారులు కార్మికులపై ఒత్తిడి తీసుకురావడం ఎంతవరకు సమంజసమని శ్యామలారాణి ప్రశ్నించారు. అనంతరం కలెక్టర్ కాటంనేని భాస్కర్కు వినతి పత్రం సమర్పించారు. కొండ్రు లక్ష్మి, ఆర్.మంగతాయారు, ఎం.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement