మహిళా ఫుట్‌బాల్‌ జట్టు ఇదే! | Sakshi
Sakshi News home page

మహిళా ఫుట్‌బాల్‌ జట్టు ఇదే!

Published Mon, Sep 19 2016 9:00 PM

మహిళా ఫుట్‌బాల్‌ జట్టు ఇదే! - Sakshi

దేవరపల్లి: రాష్ట్రస్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లా జట్టును సోమవారం దేవరపల్లి మండలం పల్లంట్ల జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ఆవరణలో ఎంపిక చేశారు. జిల్లా మహిళా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సెలెక్షన్స్‌ జరిగాయి. జిల్లా జట్టుకు పి.పద్మజ (దేవరపల్లి), సీహెచ్‌ సుభద్ర (కొయ్యలగూడెం), జి.నిర్మల (కుమారదేవం), జె.భూమిక (పల్లంట్ల), ఎం.నవ్య (పల్లంట్ల), పి.ఆర్తీ (కొయ్యలగూడెం), ఎ.లక్ష్మి(పల్లంట్ల), బి.శ్రుతి (కన్నాపురం), పి.చంద్రకళ (దేవరపల్లి), ఎం.నీరజ(దేవరపల్లి), ఎం.రమ్య (కొయ్యలగూడెం), కె.మాధవిలత (కొయ్యలగూడెం), జె.కల్యాణి (పల్లంట్ల), డి.వసంత (జంగారెడ్డిగూడెం), ఎ.సత్యవతి(పల్లంట్ల), ఎస్‌జే లక్ష్మి (దేవరపల్లి), డి.జీవనజ్యోతి (కొయ్యలగూడెం), ఈ.వెంకటలక్ష్మి (దేవరపల్లి), ఎం.రేవతి (దేవరపల్లి), సీహెచ్‌ గంగారత్నం (పల్లంట్ల) ఎంపికయ్యారని పీఈటీ ఎ.వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 23, 24 తేదీల్లో జరుగనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్టు తలపడుతుందన్నారు.
 

Advertisement
Advertisement