కార్మికుల సమ్మె నేడు | General strike today | Sakshi
Sakshi News home page

కార్మికుల సమ్మె నేడు

Sep 1 2016 11:11 PM | Updated on Oct 20 2018 6:19 PM

కార్మికుల సమ్మె నేడు - Sakshi

కార్మికుల సమ్మె నేడు

నెల్లూరు(సెంట్రల్‌): కార్మికుల డిమాండ్‌ల పరిష్కారం కోసం వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్నారు. ఈ సమ్మెకు వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలతో పాటు 11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి.

 
నెల్లూరు(సెంట్రల్‌):  కార్మికుల డిమాండ్‌ల పరిష్కారం కోసం వామపక్షాల ఆధ్వర్యంలో శుక్రవారం సార్వత్రిక సమ్మెను నిర్వహించనున్నారు. ఈ సమ్మెకు వామపక్ష అనుబంధ కార్మిక సంఘాలతో పాటు 11 కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. నెల్లూరులోని ఆత్మకూరు బస్టాండ్‌ వద్ద నుంచి  ఉదయం 9 గంటలకు కార్మికులు ర్యాలీగా బయలు దేరి గాంధీ బొమ్మ వద్దకు చేరుకుంటారు. అలాగే సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండు నుంచి ఉదయం 10 గంటలకు ర్యాలీగా బయలుదేరి గాంధీబొమ్మ సెంటరుకు చేరుకుని ఆ ప్రాంతంలో సభ నిర్వహిస్తున్నట్లు కమ్యూనిస్టు నాయకులు తెలిపారు. కార్మికుల సమస్యలను గుర్తించి సమ్మెకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
 సమ్మె జయప్రదానికి తపాలా ఉద్యోగుల పిలుపు
నెల్లూరు(దర్గామిట్ట):  సార్వత్రిక సమ్మె జయప్రదానికి జిల్లా తపాలా ఉద్యోగుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నగరంలోని ఆచారి వీధిలోని తపాలా శాఖ ప్రధాన కార్యాలయం ఆవరణలో తపాలా ఉద్యోగుల సంఘం(ఎన్‌ఎఫ్‌పీఈ) నాయకులు  గురువారం   సమావేశమై సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డివిజనల్‌ కార్యదర్శి ఏవీ కృష్ణయ్య మాట్లాడారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని ఎన్‌ఎఫ్‌పీఈ, ఎఫ్‌ఎన్‌పీఓ పోస్టల్‌ సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు  రత్నయ్య వెంకయ్య, సంపత్‌కుమార్, హుమయూన్, మహిళా ఉద్యోగులు శారద, సత్యవతి, విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
  నేడు జర్నలిస్టుల ర్యాలీ 
నెల్లూరు(బృందావనం):  సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం జర్నలిస్టుల ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్‌ తెలిపారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  ఉదయం 10గంటలకు ప్రెస్‌క్లబ్‌ నుంచి ర్యాలీ ఉంటుందని తెలిపారు. జర్నలిస్టులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ప్రెస్‌క్లబ్‌ ఇన్‌చార్జి రాజన్, ఏపీయూడబ్ల్యూజే సభ్యులు కృష్ణకిషోర్‌ లాల్, ఎడిటర్స్, జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ జిల్లా శాఖ కార్యదర్శి చంద్రబోస్, కోశాధికారి ఎం రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement