వ్యక్తి నుంచి దుప్పి స్వాధీనం | Forest beat officer possesses deer from youth says, leave it in Medak forests | Sakshi
Sakshi News home page

వ్యక్తి నుంచి దుప్పి స్వాధీనం

Jun 3 2016 11:04 AM | Updated on Oct 9 2018 5:39 PM

లచ్చపేటలో ఓ వ్యక్తి పెంచుకుంటున్న దుప్పిని అటవీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

దుబ్బాక: లచ్చపేటలో ఓ వ్యక్తి పెంచుకుంటున్న దుప్పిని అటవీ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. లచ్చపేటకు చెందిన నిమ్మ శ్రీనివాస్‌కు 8 నెలల కిందట అటవీ ప్రాంతంలో దుప్పి పిల్ల దొరికింది. దాన్ని ఇంటికి తెచ్చి 8 నెలలుగా పాలు పోసి, పచ్చ గడ్డి వేస్తూ పెంచుతున్నాడు. విషయం తెలుసుకున్న బీట్ ఆఫీసర్ రవి కిరణ్ గురువారం లచ్చపేటకు వెళ్లి దుప్పిని స్వాధీనం చేసుకున్నారు. మెదక్ అభయారణ్యంలో దుప్పిని వదిలివేయనున్నట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement