కట్నం కోసం కన్న కూతర్ని కడతేర్చి బావిలో పడేశాడో తండ్రి.
కట్నం కోసం కన్న కూతర్ని కడతేర్చి బావిలో పడేశాడో తండ్రి. అదనపు కట్నం తీసుకురమ్మని భార్యను పలుమార్లు హింసించినా ఆమె డబ్బు తేకపోవడంతో.. కోపోద్రిక్తుడైన వ్యక్తి తమ రెండున్నరేళ్ల చిన్నారిని గొంతునులిమి హత్య చేసి బావిలో పడేశాడు. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా భీమిని మండలం కుషనపల్లి గ్రామంలో గురువారం వెలుగుచూసంది.
చిన్నారి కనిపించడం లేదని ఆందోళన చెందిన తల్లి ఇంటి చుట్టుపక్కల వెతుకుండగా.. బావిలో పాప మృతదేహం కనిపించింది. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుని కోసం గాలింపు చేపట్టారు.