పిడుగుపడి అక్కడికక్కెడే మృతి | farmer died by thunder | Sakshi
Sakshi News home page

పిడుగుపడి అక్కడికక్కెడే మృతి

May 6 2017 11:25 PM | Updated on Oct 2 2018 6:42 PM

పిడుగుపడడంతో పొలం పనిచేస్తున్న రైతు అక్కడికక్కెడే మృతి చెందాడు.

దుద్యాల(కొత్తపల్లి): పిడుగుపడడంతో పొలం పనిచేస్తున్న రైతు అక్కడికక్కెడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం.. దుద్యాల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చాకలి ఆంజనేయులు(52).. తన భార్య శేషమ్మను వెంటబెట్టుకుని గ్రామ శివారులోని జమ్ములమ్మ గుడి వద్ద పొలంలో చెత్త కుప్పలకు నిప్పంటించడానికి వెళ్లాడు. అకాలంగా కురిసిన వర్షంలో అతనిపై పిడుగుపడి అక్కడికక్కెడే మృతి చెందాడు. పొలం ఆవలి గట్టు వద్ద ఉండే భార్య ఈ ఘటన చూసి భయాందోళనకు గురయ్యారు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎస్‌ఐ శివశంకర్‌నాయక్‌.. కేసు  దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement