అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | farmer commits suicide due to debts problems | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Apr 10 2016 8:37 PM | Updated on Jun 4 2019 5:04 PM

కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం మైదంబండకు చెందిన బియ్యాని మల్లయ్య(37) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు.

ముత్తారం: కరీంనగర్ జిల్లా ముత్తారం మండలం మైదంబండకు చెందిన బియ్యాని మల్లయ్య(37) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్యకు రెండెకరాల భూమి ఉంది. కొంతకాలం క్రితం మరో రెండెకరాలు కొనుగోలు చేశాడు. సాగునీటి కోసం భూమిలో కొత్తగా వ్యవసాయ బావి తవ్వించాడు.

ఈ ఏడాది ఆశించిన మేర దిగుబడి రాకపోవడంతో భూమి కొనుగోలు, బావి తవ్వకానికి అయిన అప్పు రూ.1 లక్షకు చేరింది. అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో ఆదివారం చేనులోనే క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మల్లయ్యకు భార్య తిరుమల, కుమారులు రాజ్‌కుమార్, అనిల్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement