ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు | engineering student phani kumar drowned in river | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి గల్లంతు

Jul 29 2016 1:42 PM | Updated on Sep 4 2017 6:57 AM

ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి నీట మునిగి గల్లంతయ్యాడు.

తాడేపల్లిగూడెం: ఈతకు వెళ్లిన ఇంజనీరింగ్ విద్యార్థి నీట మునిగి గల్లంతయ్యాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న మాకా ఫణికుమార్ (21)  స్థానిక వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు.

ఈక్రమంలో ఈ రోజు సాయిబాబా గుడి సమీపంలోని ప్రధాన కాలువలో ఈత కొట్టేందుకు వెళ్లి.... ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు. ఆ విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే ఫణికుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి... ఫణికుమార్ కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement