దేవాదాయ ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్ కోర్టును ఈనెల 27 ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అతిథిగృహంలో నిర్వహిస్తామని ఆ శాఖ సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు.
27న ఎండోమెంట్ ట్రిబ్యునల్
Jan 24 2017 11:53 PM | Updated on Sep 5 2017 2:01 AM
కర్నూలు(న్యూసిటీ) : దేవాదాయ ధర్మాదాయ శాఖ ట్రిబ్యునల్ కోర్టును ఈనెల 27 ఉదయం 10 గంటలకు ప్రభుత్వ అతిథిగృహంలో నిర్వహిస్తామని ఆ శాఖ సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. కార్యక్రమానికి జస్టిస్ రమణ ముఖ్యతిథిగా విచ్చేస్తారన్నారు. దేవాదాయ శాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములు, అర్చకులు, అధికారుల సమస్యలపై విచారణ జరుగుతుందన్నారు. కర్నూలు, వైఎస్సార్ కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల పరిధిలోని కక్షిదారులు హాజరై సమస్యలు కోర్టు దృష్టికి తేవాలని కోరారు.
Advertisement
Advertisement