హైదరాబాద్‌లో ఎంఫసిస్ కేంద్రం


ఐటీ సొల్యూషన్స్, సర్వీసుల రంగంలో ఉన్న ఎంఫసిస్ హైదరాబాద్‌లో కాగ్నిటివ్ హబ్‌ను ప్రారంభించింది. ఆర్థిక సేవల రంగ కంపెనీలకు ఈ కేంద్రం తదుపరి తరం గవర్నెన్స్, రిస్క్, కాంప్లియాన్స్ పరిష్కారాలను అందిస్తుంది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఈ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. 250 సీట్ల సామర్థ్యంతో దీనిని ఏర్పాటు చేసినట్టు కంపెనీ సీఈవో గణేష్ అయ్యర్ ఈ సందర్భంగా తెలిపారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top