గుమ్మడిలో డ్రగ్స్‌ అధికారుల దాడులు

గుమ్మడిలో డ్రగ్స్‌ అధికారుల దాడులు - Sakshi

 

  • రూ.2 లక్షలు విలువ చేసే  మందులు స్వాధీనం 

కోవూరు: కోవూరు మందబయలు సెంటర్‌లో ఉన్న గుమ్మడి హాస్పిటల్‌లో మంగళవారం అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ సురేష్‌బాబు ఆకస్మికంగా దాడులు చేశా రు. ఈ దాడుల్లో రూ.2 లక్షలు విలువ చేసే మందులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో అనుమతులు లేకుండా మందులు ఉన్నాయన్న విషయంపై ఫిర్యాదులు రావడతో దాడులు నిర్వహించామన్నారు. దాడులు జరిగి న సమయంలో విలువైన మందులు ఉండటంతో వాటిని పరిశీలిస్తున్నామన్నారు. ఇటీవల కోవూరులోని సెయింట్‌ పాల్స్‌ పాఠశాలలో ఆదివారం ఉచిత వైద్యశిబిరం జరిగింది. ఈ వైద్య శిబిరంలో మిగిలిన మందులను గుమ్మడి హాస్పిటల్‌లో నిల్వ ఉంచడం జరిగిందని ఉచిత వైద్యశిబిరం నిర్వహించిన యూకో ఆర్గనైజేషన్‌ నిర్వాహకులు డ్రగ్‌ అధికారులకు లిఖితపూర్వకంగా తెలియచేశారు. తరచుగా మా ఆర్గనైజేషన్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో ఉచిత వైద్యశిబిరాలునిర్వహిస్తుంటామని అందులో భాగంగానే ఈ మందులను కొనుగోలు చేసి తెచ్చామని యూకో నిర్వాహకులు తెలిపారు. ఆదివా రం మెగా వైద్యశిబిరం రాత్రి వరకు జరగడంతో ఈ మందులను గుమ్మడి హాస్పిటల్‌ ఆవరణలో ఖాళీగా ఉన్న ఓ గదిలో నిల్వ ఉంచామని డ్రగ్‌ అధికారులకు లిఖితపూర్వకంగా ఇచ్చారు. నిర్వాహకులు చెప్పిన వివరాలను నమోదు చేసుకొని నివేదికలు తయారుచేశామని డ్రగ్‌ అధికారి సురేష్‌బాబు తెలిపారు. దాడుల్లో కావలి, గూడూరు, నెల్లూరు డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు సుభాషిణి, ప్రశాంతి, మురళీ పాల్గొన్నారు. 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top