Sakshi News home page

24న ఆత్మహత్య.. అదేరోజు స్పీడ్‌పోస్టులో సూసైడ్‌నోట్!

Published Tue, May 31 2016 10:53 AM

24న ఆత్మహత్య.. అదేరోజు స్పీడ్‌పోస్టులో సూసైడ్‌నోట్! - Sakshi

వ్యభిచారం చేయాలంటూ తన తల్లి, భర్త బలవంతం చేశారని ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని ఝాన్సీ సూసైడ్ నోట్ విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఝాన్సీ హైదరాబాద్ నుంచి ఈనెల 23న ఇంటికి వచ్చిందని ఆమె తల్లి చెబుతోంది. 24వ తేదీన ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఆమె వెల్లడించింది. అయితే.. సరిగ్గా అదేరోజు ఝాన్సీ పేరుతో హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ప్రాంతం నుంచి స్పీడ్ పోస్టు ద్వారా సూసైడ్ నోట్ నకిరేకల్ పోలీసు స్టేషన్‌కు వచ్చింది.

ఈనెల 24న ఆమె ఆత్మహత్య చేసుకుంటే, మరి స్పీడ్‌పోస్ట్ ఎవరు చేశారన్న అంశంపై పోలీసులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. పైపెచ్చు, ఆమె సూసైడ్ నోట్ మొత్తం టైప్ చేసి ఉంది. దాని కింద ఆమె సంతకం చేసింది. ఝాన్సీ సంతోష్‌నగర్‌లోని ఐఎస్ సదన్ హాస్టల్లో ఉండేది. కానీ స్పీడ్‌పోస్ట్ మాత్రం సరూర్‌నగర్ నుంచి వచ్చింది. తన భర్తకు, తల్లికి వివాహేతర సంబంధం ఉందని.. అందువల్ల తాను అతడితో కలిసి ఉండేది లేదని ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు పట్టించుకోలేదని ఆమె తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

Advertisement
Advertisement