అజ్ఞాతంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ | dispute between tdp mla jc prabhakar reddy, police | Sakshi
Sakshi News home page

అజ్ఞాతంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ

Feb 3 2016 2:05 PM | Updated on Sep 3 2017 4:53 PM

అజ్ఞాతంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ

అజ్ఞాతంలో టీడీపీ ఎమ్మెల్యే జేసీ

అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు.

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులతో ఆయనకు వివాదం ఏర్పడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

తన అనుచరులకు పెయిడ్ గన్మెన్లను కేటాయించడం పట్ల జేసీ ప్రభాకర్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసనగా తన వద్ద విధులు నిర్వహిస్తున్న ఇద్దరు గన్మెన్లను ఆయన వెనక్కి పంపించివేశారు. ఈ ఘటన జరిగి ఐదు రోజులవుతున్నా పోలీస్ ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. గన్మెన్లు లేకపోవడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement