అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి బరితెగింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడి చేయాలని తన అనుచరుల ఉసిగొల్పారు. వైఎస్సార్ సీపీ హయాం లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరిగాయని సోషల్ మీడియా లో జేసీకి వైఎస్సార్ సీపీ నేతలు కౌంటర్ ఇవ్వడంతో పచ్చమూకలు దాడులకు దిగాయి.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నేతలను నామినేషన్లు వేయనీయమని హెచ్చరించిన జేసీ ప్రభాకర్రెడ్డి.. వైఎస్సార్ సీపీ నేతల ఇళ్ల పైకి టీడీపీ గూండాలను ఉసిగొల్పి పంపారు. దాంతో 50 వాహనాల్లో తాడిపత్రి నుంచి పెద్దవడగూరు మండలానికి వెళ్లారు జేసీ అనుచరులు. వైఎస్సార్ సీపీ నేతల ఇళ్ల వద్ద టీడీపీ నేతల దౌర్జన్యం చేశారు. జేసీ అనుచరులు.. వైఎస్సార్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు.


