అనంతపురం: తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. వైఎస్సార్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై అక్రమ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పీఎస్ వద్ద స్నానం చేస్తూ హైడ్రామా నెలకొల్పారు. తాడిపత్రి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వేచ్ఛ గా పర్యటించవచ్చని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ,.. ఆ ఆదేశాలు అమలు కాకుండా జేసీ ప్రభాకర్రెడ్డి కుట్రలకు తెరలేపారు.

మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దౌర్జన్యం చేశారని.. కేసులు నమోదు చేయాలని తాను అనుచరుల ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయించారు ప్రభాకర్రెడ్డి. ఆ ఫిర్యాదులు ఆధారంగా కేసులు నమోదు చేయాలని తాడిపత్రి పీఎస్ వద్ద ఓవకాక్షన్ చేశారు.. నడిరోడ్డుపై స్నానం చేసి పోలీసులపై ఆరోపణలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఒత్తిడితో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పై కేసు నమోదు చేశారు పోలీసులు.



