తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం కూడా కొనసాగుతోంది.
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం కూడా కొనసాగుతోంది. కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు 18 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. అలాగే శ్రీవారి సర్వదర్శనానికి 9 గంటల సమయం పడుతుంది. నడక దారిలో వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. శ్రీవారి హుండీ ఆదాయం మంగళవారం రూ. 3.03 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.