'పవన్పై వాళ్లు విమర్శలు చేయడం సిగ్గుచేటు' | CPI leader ramakrishna supports to pawan kalyan | Sakshi
Sakshi News home page

'పవన్పై వాళ్లు విమర్శలు చేయడం సిగ్గుచేటు'

Sep 11 2016 11:07 AM | Updated on Mar 22 2019 5:33 PM

'పవన్పై వాళ్లు విమర్శలు చేయడం సిగ్గుచేటు' - Sakshi

'పవన్పై వాళ్లు విమర్శలు చేయడం సిగ్గుచేటు'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా కోసం సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యక హోదా కోసం సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్తో కలిసి పోరాటం చేస్తామని సీపీఐ సీనియర్ నేత రామకృష్ణ పేర్కొన్నారు. ప్రత్యేక ప్యాకేజీ అంశం తాజా పరిణామాలపై గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయని ఎంపీలు ఇప్పుడు సిగ్గు లేకుండా పవన్పై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాచిపోయిన లడ్డూలను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెరొకటి తింటున్నారని ఎద్దేవా చేశారు.

ప్యాకేజీపై చంద్రబాబు రకరకాల ప్రకటనలు చేస్తూ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై చంద్రబాబు ఇప్పటికే ఐదు రకాల ప్రకటనలు చేశారని చెప్పారు. ఇకనుంచి ఏపీలో బీజేపీ నిర్వహించే ప్రతి బహిరంగ సభ వద్ద నిరసన తెలుపుతామని సీపీఐ నేత రామకృష్ణ హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement