విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుడు ఆత్మహత్య
తమ్మడపల్లె గ్రామంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు(పోల్టూపోల్) తిరుమలయ్య (42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మహానంది:
తమ్మడపల్లె గ్రామంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుడు(పోల్టూపోల్) తిరుమలయ్య (42) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఆత్మహత్యకు విద్యుత్ శాఖ ఉద్యోగి కారణమని సూసైడ్ నోట్ రాశాడు. గ్రామానికి చెందిన కె.తిరుమలయ్య మసీదుపురం గ్రామంలో పోల్టూపోల్ కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. అయితే అక్కడే పనిచేస్తున్న అప్పటి ఏఎల్ఎం పాపన్న రైతులకు ఇచ్చే ఎజీఎల్(వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు) కనెక్షన్ల కోసం వసూలు చేసిన రెండున్నర లక్షల డబ్బులను వాడుకున్నాడు. అప్పటి నుంచి తిరుమలయ్యపై రైతుల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి. దీంతో ఒత్తిడి తట్టుకోలేక ఉరేసుకుని మృతి చెందినట్లు లేఖలో తెలిపారు. తన భార్యాబిడ్డలను ఆదుకోవాలని లేఖలో అధికారులను వేడుకున్నాడు. మృతుడికి భార్య మరియమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉండగా రాత్రి 8.15 వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని మహానంది ఎస్ఐ జి.పెద్దయ్యనాయుడు తెలిపారు.