కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నుమూత | Congress former MP died in Apolo hospital over lung disease | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నుమూత

May 28 2016 9:16 PM | Updated on Sep 28 2018 3:41 PM

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు లోక్‌సభ మాజీ సభ్యుడు దేవరకొండ విఠల్ రావు (69) కన్నుమూశారు.

హైదరాబాద్: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు లోక్‌సభ మాజీ సభ్యుడు దేవరకొండ విఠల్ రావు (69) కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా ఆయన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు.

చికిత్స నిమిత్తం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా, 2004 ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి విఠల్‌ రావు లోక్ సభకు ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement