చ‌ల‌చ‌ల్ల‌గా మోసం | cold storage properties | Sakshi
Sakshi News home page

చ‌ల‌చ‌ల్ల‌గా మోసం

May 27 2017 3:39 AM | Updated on Sep 5 2017 12:03 PM

చ‌ల‌చ‌ల్ల‌గా మోసం

చ‌ల‌చ‌ల్ల‌గా మోసం

రైతుల పాలిట కల్ప వృక్షాలుగా ఉండాల్సిన కోల్డ్‌ స్టోరేజీలు సంబంధిత యజమానులకు కాసులు కురిపించే కేంద్రాలుగా మారుతున్నాయి.

– కోట్ల రుణం ఎగవేతతో కదిలిన బ్యాంకు అధికారులు
- కోల్డ్‌ స్టోరేజీలో పని చేస్తున్న కూలీల పేరుతో రుణాలు మంజూరు
- పరిశీలనలో వేరుశెనగ తొక్కలు, చెక్కపొట్టు ప్రత్యక్షం
- వాటినే వ్యవసాయ ఉత్పత్తులుగా నమ్మించి రుణం

 
ప్రత్తిపాడు : రైతుల పాలిట కల్ప వృక్షాలుగా ఉండాల్సిన కోల్డ్‌ స్టోరేజీలు సంబంధిత యజమానులకు కాసులు కురిపించే కేంద్రాలుగా మారుతున్నాయి. అక్కడ పని చేసే కూలీలనే రైతులుగా మార్చేసి ... వారే తమ స్టోరేజీల్లో పంటలు భద్ర పరుచుకున్నారని వస్తోత్పత్తులను చూపించి బ్యాంకులకు బురిడీ కొట్టి కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఇందుకు కొంతమంది బ్యాంకు సిబ్బంది కూడా సహకరించడంతో మోసం మరింత సులవవుతోంది. ఈ తరహాలోని కోల్డ్‌ స్టోరేజీ మోసం మరొకటి జిల్లాలో బయటపడింది. తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి కోట్ల రూపాయల రుణం పొంది ఎగనామం పెట్టిన ప్రత్తిపాడు జాతీయ రహదారి పక్కన ఉన్న ధర్మవరం సాయిభ్య అగ్రి కోల్డ్‌ స్టోరేజీ ఆస్తులను శుక్రవారం సాయంత్రం కాకినాడ ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ సంఘటన పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.

ధర్మవరం జాతీయ రహదారి సమీపాన రెండు దశాబ్దాల క్రితం కంచుస్తభం వెంకట సత్య ప్రసాద్‌ సాయిభ్య ఆగ్రి కోల్డు స్టోరేజీని నెలకొల్పారు. కాకినాడ దేనా బ్యాంకు నుంచి రూ. 28 కోట్లు బినామీ రుణాలు పొంది, ఎగవేయడంతో దేనా బ్యాంక్‌ అధికారులు కంచుస్తంభం వెంకట సత్య ప్రసాద్‌తోపాటు మరో 111 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ  స్టోరేజీలో రైతులు అందజేసే చింతపండు, ఎర్ర మిరప, మామిడి తాండ్ర, పత్తి విత్తనాలు తదితర వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేయాలి. కానీ అవేవీ నిల్వ చేయకుండానే ఉన్నట్టుగా లెక్కలు చూపించి భారీగా రుణాలు తీసుకోవడంతో అసలుకే ఎసరు వచ్చింది.

రైతుల పేరుతో తీసుకున్న రుణాలకు సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులను బ్యాంకు అధికారలు పరిశీలించగా ఖాళీ పెట్టెల్లో వేరుశెనగ తొక్కలు, చెక్క పొట్టుతో ఉన్నాయి. రుణం పొందిన బినామీ రైతులంతా కోల్డు స్టోరేజీలో పనిచేస్తున్న కూలీలే. దీనిపై మహబూబ్‌ నగర్‌ జిల్లా కొత్త వనపర్తి మండలానికి చెందిన దేనా బ్యాంకు కాకినాడ బ్రాంచి మేనేజర్‌ గత ఫిబ్రవరి నెలలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకు మేనేజర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రత్తిపాడు సీఐ అద్దంకి శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టోరేజీ యజమాని సత్య ప్రసాద్‌ పరారీలోనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement