స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నగరంపై పోలీసులు డేగ కన్ను ఉంచారు. అందులో భాగంగా అనుమానం ఉన్న చోట్లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు.
హైదరాబాద్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నగరంపై పోలీసులు డేగ కన్ను ఉంచారు. అందులో భాగంగా అనుమానం ఉన్న చోట్లలో విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, చైతన్యపురి పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నారు. షాపింగ్ మాల్స్, స్కూళ్లపై ప్రధానంగా దృష్టిని నిలిపి అప్రమత్తమవుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే పోలీసులు జాగ్రత్త పడుతున్నారు.