హైదరాబాద్: ఈ నెల 24న(శుక్రవారం) తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థలన్నీ బంద్ చేసి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక పిలుపునిచ్చింది. ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్,ఎన్ఎస్యూఐ,పీడీఎస్యూ,ఏఐఎఫ్డీఎస్ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రారంభించాయి.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలో లాఠీఛార్జ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని,. విద్యార్థులపై పెట్టిన కేసులు కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి.


