వీఐపీ ఘాట్ (రాజమండ్రి): పుష్కరాల్లో తమ పూర్వీకులకు పిండప్రదానం చేయడం సంప్రదాయం. ఈ క్రతువును శాస్త్రోక్తంగా నిర్వర్తించడంలో ప్రతి ఒక్కరూ అత్యంత శ్రద్ధ తీసుకుంటారు. అయితే కేంద్ర మాజీ మంత్రి, సినీనటుడు మెగాస్టార్ చిరంజీవి రాజమండ్రి వీఐపీ ఘాట్లో బుధవారం పుష్కర స్నానం చేసి, తన పూర్వీకులకు చేసిన పిండప్రదాన తంతును అసంపూర్తిగా చేసి వెళ్లిపోవడం పలు విమర్శలకు దారి తీసింది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో తన బావమరిది అల్లు అరవింద్, దర్శకుడు బి.గోపాల్, మేనల్లుడు అల్లు శిరీష్తో కలిసి వీఐపీ ఘాట్కు చేరుకున్నారు. చిరంజీవిని చూసేందుకు అప్పటికే వేలాదిగా యాత్రికులు ఎదురు చూస్తున్నారు.
పోలీసు బందోబస్తు నడుమ ఆయన ఘాట్లోకి వెళ్లి గోదావరిలో స్నానమాచరించారు. అప్పటికే ఘాట్ మెట్లపై పిండప్రదానానికి ఏర్పాట్లు చేశారు. చిరంజీవి తదితరులు అక్కడకు చేరుకుని ఆ క్రతువు ప్రారంభించారు. ఐదు నిమిషాల వ్యవధిలోనే ఆ తంతు ముగించేసేశారు. ఈలోగా అభిమానులు, యాత్రికులు ఆయనను చూసేందుకు ఎగబడటంతో రద్దీ పెరిగింది. ఇంతలో చిరంజీవి పిండ్రపదానంలో తీర్థవిధులు పూర్తి చేసి, వాటిని గోదావరిలో కలపకుండా మెట్లపైనే వదిలేసి వెళ్లిపోయారు. ఇది చూసిన అభిమానులు, యాత్రికులు విస్తుపోయారు. పిండాలు గోదావరిలో కలపకుండా అలా వదిలేశారేమిటా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ క్రతువు చేయించిన పురోహితుడు నోట మాట రాక అలాగే ఉండిపోయాడు. ఇంతలో అది సరికాదని భావించిన అభిమానులు.. పారిశుధ్య కార్మికుల సాయంతో చిరంజీవి వదిలేసిన తీర్థవిధులను ఎత్తించి చెత్తకుండీలో వేయించారు. ఈవిధంగా చేయడం శాస్త్రవిరుద్ధమని పలువురు పురోహితులు అన్నారు. గోదావరిలో కలపకపోతే పిండప్రదానం పూర్తయినట్టు కాదని, ఇది ఫలితం ఇవ్వదని అన్నారు. పుష్కర స్నానం అయిన తరువాత చిరంజీవి విలేకర్లతో మాట్లాడుతూ పుష్కర మాహాత్మ్యం, స్నానం చేస్తే చేకూరే పుణ్యం గురించి గొప్పగా చెప్పడం విశేషం.
చిరంజీవీ.. మీకిది తగునా?
Published Wed, Jul 22 2015 10:16 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement