డ్రైవర్ నిర్లక్ష్యం..బస్సు కిందపడి చిన్నారి మృతి


స్కూలు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకుంది. ఈసంఘటన రాజాపేట మండలం రేనికుంటలో జరిగింది. చిన్నారి ఇంటి దగ్గర స్కూలు బస్సు దిగుతుండగా బ్యాగు బస్సు డోర్‌కు తగులుకుంది. ఇది గమనించని బస్సు డ్రైవర్ బస్సును ముందుకు కదిలించడంతో బస్సు చిన్నారిని కొంతదూరం ఈడ్చుకుపోయింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన చిన్నారి భువన(5) ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



 

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top