కలకలం రేపుతున్న చేగొండి పుస్తకం | Chegondi book making controversy | Sakshi
Sakshi News home page

కలకలం రేపుతున్న చేగొండి పుస్తకం

Nov 3 2015 6:48 AM | Updated on Sep 3 2017 11:54 AM

కలకలం రేపుతున్న చేగొండి పుస్తకం

కలకలం రేపుతున్న చేగొండి పుస్తకం

వంగవీటి మోహనరంగా హత్యోదంతంలో ఆనాటి టీడీపీ కర్షక పరిషత్ చైర్మన్, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపై మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చకు తెరలేపాయి.

- రంగా హత్యోదంతంలో కుట్ర కోణంపై తీవ్ర చర్చ
-  చంద్రబాబుపై కాపు యువత ఆగ్రహావేశాలు
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు:
వంగవీటి మోహనరంగా హత్యోదంతంలో ఆనాటి టీడీపీ కర్షక పరిషత్ చైర్మన్, ఏపీ సీఎం చంద్రబాబు పాత్రపై మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చకు తెరలేపాయి. వాస్తవానికి రంగా కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబుపై గతంలోనే ఇటువంటి ఆరోపణలు వచ్చాయి. అయితే రంగా హత్యకు దారితీసిన పరిణామాలను చేగొండి తన పుస్తకంలో పూసగుచ్చినట్టు ఇపుడు బయట పెట్టడం కలకలం రేపుతోంది. చేగొండి సీనియర్ నాయకుడు కావడం, తెలుగుదేశం రాజకీయాలను సన్నిహి తంగా చూసినవాడు కావడంతో ఆయన పుస్తకంలోని అంశాలు హాట్‌టాపిక్‌గా మారాయి. అధికార తెలుగుదేశం పార్టీ నేతల నుంచి తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రావడంతో చేగొండి సోమవారం ఉదయం నుంచి.. ఇవన్నీ నేను అంతకుముందు చెప్పినవే.. కొత్తగా చెప్పిందేమీ లేదు అని వ్యాఖ్యానిస్తున్నారు. బలీయమైన శక్తిగా ఎదుగుతున్న కాపు నాయకుడు రంగాను మట్టుబెట్టిన పథకానికి రూపక ర్తలు ఎవరు..  కుట్రకు అసలు మూలం ఎవరు అనేది ఆయన పుస్తకం చదివితే ఎవరికైనా తెలిసిపోతుంది.
 
 రంగా కు భద్రత ఇవ్వకుండా అడ్డుకున్న వైనం మొదలుకుని.. రంగాను మట్టుబెట్టేందుకు దారుణ హత్యోదంతం రూపకర్తలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన వ్యవహారంలో ఎవరు కీలకంగా వ్యవహరించారో జోగయ్య పుస్తకం చదివితే ఇట్టే అర్థమవుతుంది. మరోవైపు కాపులలో ఇది తీవ్ర ఆగ్రహావేశాలకు కారణమయ్యింది. రంగా హత్య కేసును తిరగదోడాలని, చంద్రబాబును ప్రధాన నిందితునిగా చేర్చి సీబీఐతో విచారణ చేపట్టాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పార్టీలకు అతీతంగా కాపు యువనేతలు సోమవారం వివిధ ప్రాంతా ల్లో రోడ్లపైకి వచ్చారు. బాబుకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తించారు.  
 
 దేశం నేతల్లో కలవరం: ఇక టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. బాబు అధికారంలోకి  వచ్చిన తర్వాత కాపులను పూర్తిగా పక్కన పెట్టేశారన్న వాదనలున్నాయి. కాపులకు ఉపముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టామంటూ  చినరాజప్పకు హోంశాఖ అప్పగించినా.. ఆ శాఖలో ఎవరి పెత్తనం సాగుతుందో అందరికీ తెలుసన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బలమైన నేతలకు నామమాత్రపు పదవులు, పట్టులేని నాయకులకు కీలక పదవులు అప్పగించే చంద్రబాబు ధోరణితో కాపునేతలు విసుగెత్తిపోయారు. ఎన్నికల ముందు కాపులకు ఇచ్చిన హామీలను అటకెక్కించిన బాబు వైఖరిపై ఆ సామాజిక వర్గ నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు.  ఇదే సమయంలో జోగయ్య రేపిన పాత గాయం పార్టీని ఏ మేరకు దెబ్బతీస్తుందనే లెక్కల్లో టీడీపీ నేతలు మునిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement