'చంద్రబాబుకు జీరో మార్కులు' | chandrababu get zero marks, says peddireddy ramachandra reddy | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు జీరో మార్కులు'

Jul 20 2016 1:05 PM | Updated on May 29 2018 4:40 PM

'చంద్రబాబుకు జీరో మార్కులు' - Sakshi

'చంద్రబాబుకు జీరో మార్కులు'

ఆంధ్రప్రదేశ్ లో రాక్షసపాలన సాగుతోందని పుంగనూరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.

చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ లో రాక్షసపాలన సాగుతోందని పుంగనూరు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. చంద్రబాబు పాలనపై వైఎస్సార్ సీపీ సంధించిన 100 ప్రశ్నలకు ఇప్పటివరకు వచ్చిన సమాధానాల్లో జీరో మార్కులు వచ్చాయని వెల్లడించారు. చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... కృష్ణా పుష్కరాల పేరుతో 30 దేవాలయాలను కూల్చివేయించిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. కృష్ణా పుష్కరాల పేరు చెప్పి చందాలు అడగడం చంద్రబాబు దిగజారుడుతనానికి నిదర్శమని పెద్దిరెడ్డి దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement