-
అందరి కృషి వల్లే ‘పుష్కర’ విజయం
– ఎస్పీ రెమా రాజేశ్వరి మహబూబ్నగర్ క్రైం: తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి జరిగిన కృష్ణా పుష్కరాలను అందరి సహకారంతో విజయవంతం చేసినట్లు ఎస్పీ రెమా రాజేశ్వరి పేర్కొన్నారు. కృష్ణా పుష్కర విధులలో పాల్గొన్న డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బందికి సోమవారం ఎస్పీ కార్యాలయంలో రెమా రాజేశ్వరి ప్రశంసపత్రాలతో పాటు అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో 52పుష్కరఘాట్లలో దాదాపు 1.80కోట్ల మంది పుణ్యస్నానం చేశారని, ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది లేకుండా సమన్వయంతో విధులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ను దారి మళ్లించడంతో పాటు ఎక్కడా రద్దీగా ఉండకుండా క్లియర్ చేయడంలో పూర్తిగా విజయం సాధించినట్లు తెలిపారు. జిల్లాకు పుష్కరస్నానంలో భాగంగా దాదాపు 5.50లక్షల వాహనాలు వచ్చాయని, వాటన్నింటినీ ఆయా ఘాట్లకు పంపించడం సవాల్తో కూడుకున్న వ్యవహారం అయినా, అందులో పూర్తిస్థాయిలో విజయం సాధించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. సిబ్బందితో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని జిల్లాలో చిన్న సంఘటన జరగకుండా చూడటం పోలీస్శాఖ ఉన్నతికి నిదర్శనమన్నారు. అనంతరం పోలీస్ సిబ్బందితో ఎస్పీ గ్రూప్ ఫొటో దిగారు. కార్యక్రమంలో ఓఎస్డీ కల్మేశ్వర్ సింగనవార్, అదనపు ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కృష్ణా పుష్కరాలపై సావనీర్ రూపొందించాలి
మహబూబ్నగర్ న్యూటౌన్: కృష్ణా పుష్కరాలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో సావనీర్ రూపొందించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ టీకే శ్రీదేవి తెలిపారు. సావనీర్ రూపకల్పనకు అవసరమైన సమాచారాన్ని సేకరించి త్వరితగతిన సావనీర్ను ప్రచురించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై రూపొందించనున్న సావనీర్పై ఏర్పాటు చేసిన కమిటీ అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా సావనీర్లో కృష్ణా పుష్కరాల నిర్వహణకు చేపట్టిన అన్ని చర్యలతో పాటు ప్రచురణలు, ఫొటోలు, ముఖ్యమైన అంశాలన్నీ వచ్చే విధంగా సావనీర్ను రూపొందించాలని కమిటీ సభ్యులకు సూచించారు. సావనీర్ వచ్చే పుష్కరాలకు ఒక మంచి రెఫరెన్సు రికార్డులా ఉపయోగపడాలని సూచించారు. సావనీర్లో కృష్ణా పుష్కరాల సందర్భంగా చేపట్టిన ప్రతీ అంశం, ప్రతీ అనుభవం వచ్చేలా తయారు చేయాలని అన్నారు. డీఆర్ఓ భాస్కర్, సెట్మా సీఈఓ హన్మంతురావు, పరిశ్రమల శాఖ జీఎం సోమశేఖర్రెడ్డి‡, బీసీ కార్పొరేషన్ ఈడీ రాజేందర్, డీపీఆర్ఓ వెంకటేశ్వర్లు, డీఐఓ డాక్టర్ కృష్ణ, తెలుగు పండిత్ గిరిజారమణ సావనీర్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు. -
జిల్లాలో 1,84,94,164మంది పుష్కరస్నానం
కృష్ణవేణి ఒడిలో తరించిన భక్తులు ముగిసిన పుష్కర మహోత్సవాలు నదీమతల్లికి సంధ్యాహారతితో వీడ్కోలు పలికిన భక్తులు బీచుపల్లిలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, లక్ష్మారెడ్డి, జూపల్లి, అలంపూర్లో కలెక్టర్ పూజలు సోమశిలలో హారతి ఇచ్చిన మంత్రి లక్ష్మారెడ్డి చివరిరోజూ ఘాట్లకు పోటెత్తిన జనం లక్షలాది మంది పుణ్యస్నానం సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : కృష్ణా పుష్కరాలు ముగిశాయి. జిల్లాలో 12రోజులపాటు అత్యంత వైభవంగా సాగాయి. పండితుల వేదమంత్రాల మధ్య మళ్లొస్తాం అంటూ మంగళవారం కృష్ణవేణికి వీడ్కోలు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కృష్ణ పుష్కరాలు జిల్లాలో వివిధ పుష్కరఘాట్లలో అత్యంత వైభోవోపేతంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈనెల 12వ తేదీన అలంపూర్లోని గొందిమళ్లలో ఉదయం 5.58 నిమిషాలకు అధికారికంగా ప్రారంభించారు. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లకు భక్తులు పోటెత్తారు. జోగుళాంబ దేవాలయాన్ని సీఎం కుటుంబసమేతంగా దర్శించారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్ దంపతులు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, డీజీపీ అనురాగ్శర్మ, జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వీకే సింగ్, అడిషన్ డీజీ అంజనికుమార్, డీఐజీ అకున్ సబర్వాల్, మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, తదితరులు అలంపూర్లోని జోగుళాంబ దేవాలయాన్ని సందర్శించారు. పుష్కరాల చివరి రోజైన మంగళవారం జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచుపల్లి, అలంపూర్, సోమశిల, రంగాపూర్, నది అగ్రహారం, పస్పుల, పంచదేవ్పహాడ్, మరుముల, గుమ్మడం, మూనగాన్దిన్నె, కృష్ణ, పాతాళగంగ వంటి పుష్కరఘాట్లలో లక్షలాదిగా భక్తులు చివరిరోజు పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా అనేక మంది పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. 12వ తేదీనుంచి 23వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ఘాట్లలో 1,84,94,164 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖుల పూజలు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి రంగాపూర్ ఘాట్లో కుటుంబ సభ్యులతో పుణ్యస్నానం ఆచరించి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. జైళ్ల శాఖ అడిషనల్ డీజీ వీకే సింగ్ బీచుపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయాన్ని సందర్శించారు. రంగాపూర్ ఘాట్లో సినీ నిర్మాత రామ యాదిరెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పుణ్యస్నానాలు చేసి పూజలు నిర్వహించారు. రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్గౌడ్, ఆల వెంకటేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఛైర్మన్ బండారు భాస్కర్, కలెక్టర్ టికె.శ్రీదేవి రంగాపూర్, బీచుపల్లి పుష్కరఘాట్లను సందర్శించారు. గొందిమళ్లలో సీఎం పుష్కరాలను ప్రారంభించిన ప్రాంతంలోనే జిల్లా కలెక్టర్ శ్రీదేవి, రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి కృష్ణారావులు పుష్కరాలను ముగింపు ఉత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రజలను క్షేమంగా చూడాలంటూ పండితులు వేద ఆశీర్వాదం చేశారు. బీచుపల్లిలో జరిగిన పుష్కరాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొని కృష్ణమ్మకు ప్రత్యేక గంగ హారతి ఇచ్చారు. 12 రోజులపాటు పుష్కరాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహించిన ప్రతి ఒక్కరికీ మంత్రులు అభినందనలు తెలిపారు. సోమశిలలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎం అభినందించారు జిల్లాలో కృష్ణా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం, వలంటీర్లు, స్వచ్ఛంద సేవా సంస్థలు, 48 శాఖల ఉద్యోగ, సిబ్బంది సహాయ సహాయ సహకారాలతో పుష్కరాలు జయప్రదం అయ్యాయి.’’ – కలెక్టర్ టీకే శ్రీదేవి -
ఉప్పొంగిన జన కృష్ణమ్మ
పుష్కర మహోత్సవ వేళ పాలమూరు కృష్ణాతీరం జనసంద్రాన్ని తలపించింది. సెలవు రోజుల్లో జనం రద్దీ అనూహ్యంగా పెరిగింది. విశిష్ట స్థల పురాణం ఉన్న ఘాట్లకు భక్తులు పోటెత్తారు. 12రోజుల పాటు జోగుళాంబ(గొందిమల్ల), సోమశిల, బీచుపల్లి, రంగాపూర్ ప్రధాన ఘాట్లు భక్తులతో రద్దీగా మారాయి. వీటితో పాటు నదీ అగ్రహారం, పసుపుల, కృష్ణ, పాతాళగంగ ఘాట్లు కూడా కిటకిటలాడాయి. జోగుళాంబలో 20 లక్షలు జోగుళాంబఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాలు ప్రారంభోత్సవానికి అలంపూర్ సమీపంలోని గొందిమల్ల జోగుళాంబ ఘాట్ వేదికైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ వేడుకలను ప్రారంభించారు. గవర్నర్, మండలి చైర్మన్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్రస్థాయి అధికారులు, నాయకులు, సినీ స్టార్లు ఇక్కడే పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి పుష్కర స్నానాలు ఆచరించారు. పుష్కరాల 12రోజులపాటు దాదాపు 20 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరించారు. భక్తులకు ఇబ్బందులు కలకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, అగ్నిమాపక, విద్యుత్ శాలు విధులు సమర్థవంతంగా నిర్వహించి, సదుపాయాలు కల్పించారు. 12 రోజులపాటు ప్రశాంత వాతావరణంలో పుష్కరాలు నిర్వహించడంలో అధికారులు సఫలమయ్యారు. సోమశిలలో 27.81లక్షలు సోమశిల పుష్కరఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల ఘాట్లో మొత్తం 27.81లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. 12వ తేదీ 53వేలు, 13న 90వేలు, 14న 1,22,200, 15న 1.52లక్షలు,16న 86,600, 17న 1.60లక్షలు, 18న 1.52లక్షలు, 19న 1,39,300, 20న 4.43లక్షలు, 21న 5.91లక్షలు, 22న 4.81లక్షలు, 23న 3.11లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారుల అంచనా. తొలి 8 రోజులు భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగింది. ఆ తర్వాత నాలుగురోజులు అనూహ్యంగా పెరిగింది. ట్రాఫిక్ను పోలీసులు సమర్థవంతంగా నియంత్రించారు. సినీ నటుడు నందమూరి బాలకృష్ణ, టీజేఏసీ చైర్మన్ కోదండరాం, మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎంలు దామోదర రాజనర్సింహ్మతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు పుణ్యస్నానాలు చేశారు. మంచాలకట్టలో 5.5లక్షలు, అమరగిరిలో 6 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. రంగాపూర్లో 45లక్షలు రంగాపూర్ఘాట్ నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాలను పన్నెండు రోజుల పాటు రంగాపూర్ఘాట్లో విజయవంతంగా నిర్వహించారు. రాష్ట్రంలో అత్యధికంగా ఈ ఘాట్లోనే భక్తులు పుణ్యస్నానాలు చేశారు. జిల్లాలో దాదాపు 2 కోట్ల మంది పుష్కరస్నానం చేస్తే అందులో 45లక్షల మంది అతి విశాలమైన రంగాపూర్లోనే స్నానమాచరించారు. మొదటి రెండు రోజులు జనం పలుచగా ఉన్నా నెమ్మదిగా పుంజుకుని చివరి నాలుగు రోజులు లక్షల్లో పోటెత్తారు. 10వ రోజే ఏకంగా 9 లక్షల మంది ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించారు. పోలీసులు, అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించి భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుష్కరోత్సవాలను విజయవంతం చేశారు. రంగాపూర్ఘాట్కు వీఐపీల తాడికి అంచనాలకు మించి ఉన్నట్లు ఘాట్ ప్రత్యేకాధికారులు ఏజేసీ బాలాజీ రంజిత్ ప్రసాద్, డ్వామా పీడీ కట్టా దామోదర్రడ్డి, ఆర్డీఓ రామచందర్ తెలిపారు. బీచుపల్లిలో 39.50 లక్షలు బీచుపల్లి నుంచి ‘సాక్షి’ బృందం: కృష్ణా పుష్కరాల్లో 12రోజుల పాటు ఇటిక్యాల మండలం బీచుపల్లిలో 38.50 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేసి, పునీతులయ్యారు. పుష్కరఘాట్ ఇన్చార్జ్ ఎమ్మెల్యే శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలో ప్రత్యేకాధికారులు జేసీ రాంకిషన్, గంగారెడ్డి అనునిత్యం ఎప్పటికప్పుడు ఘాట్లను పర్యవేక్షిస్తూ పుష్కరాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దిగ్విజయంగా నిర్వహించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా గద్వాల డీఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో 1200మంది పోలీసులు నిఘా సారించారు. ప్రధానంగా ఘాట్లన్నీ శుభ్రంగా ఉంచడంతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలల్లో అపరిశుభ్రత నెలకొనకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి ఏర్పాట్లు ఘనంగా ఉన్నాయని నిరూపించారు. ఈ నెల 12న తెల్లవారుజామున నదీహారతితో ప్రారంభమైన పుష్కరాలు మంగళవారం సాయంత్రం 7గంటలకు నదీహారతితో ముగించారు. -
భక్తజన ప్రభంజనం
11వ రోజు 20,90,778మంది పుష్కరస్నానం పెరిగిన వీఐపీల తాకిడి సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: కృష్ణా పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరించడానికి వరుసగా 11వ రోజు సైతం భక్తులు పోటెత్తారు. శని, ఆదివారాలతో పోలిస్తే కొంత భక్తుల రద్దీ తగ్గినప్పటికీ సోమవారం సైతం అన్ని పుష్కరఘాట్లు కిటకిటలాడాయి. మొత్తం 20,90,778మంది భక్తులు పుష్కరస్నానం ఆచరించారు. తెల్లవారుజాము ఐదు గంటల నుంచే పుష్కరఘాట్లు జనసంద్రంగా మారాయి. పుష్కర స్నానానికి ఒక్కరోజే మిగిలి ఉండటంతో వీఐపీలతో సహా సాధారణ ప్రజలు పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి బారులు తీరారు. జిల్లాలోని వివిధ పుష్కరఘాట్లలో కొందరు ప్రముఖులు పుణ్యస్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా హైదరాబాద్, కర్నూలు జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించగా ఎస్పీ రెమా రాజేశ్వరి పర్యవేక్షించారు. జిల్లాలోని గొందిమళ్ల, బీచ్పల్లి, రంగాపూర్, సోమశిల, నదీఅగ్రహారం, కృష్ణ, పస్పుల, పంచదేవ్పహాడ్, క్యాతూరు, గుమ్మడం, మునగాన్దిన్నె, పాతాళగంగ తదితర పుష్కరఘాట్లు భక్తులతో పోటెత్తాయి. సోమవారం పది లక్షలకుపైగా భక్తులు పుష్కరస్నానం ఆచరించారని అధికారులు తెలిపారు. సోమశిల పుష్కరఘాట్లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, కలెక్టర్ టి.కె.శ్రీదేవి సాయంత్రం, బీచుపల్లిలో మరో మంత్రి లక్ష్మారెడ్డి గంగాహారతి ఇచ్చారు. రంగాపూర్ ఘాట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మణ్, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి తదితరులు పుణ్యస్నానం ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డీజీపీ దినేష్రెడ్డి అలంపూర్లోని గొందిమళ్లలో పుణ్యస్నానం ఆచరించి అలంపూర్ ఆలయాన్ని సందర్శించారు. మూలమల్లలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యస్నానం ఆచరించారు. సినీనటుడు, రవితేజ తమ్ముడు రాజగోపాల్ పుణ్యస్నానం ఆచరించారు. అలంపూర్లో రాష్ట్ర జైళ్ల డీజీపీ గోపినాథ్రెడ్డి, ఐపీఎస్ అధికారి విక్రంసింగ్ తదితరులు పుణ్యస్నానాలు ఆచరించి జోగుళాంబను దర్శించుకున్నారు. మరింత తగ్గిన నీటిమట్టం కాగా, సోమవారం అన్ని పుష్కరఘాట్లలో నీటిమట్టం మరింత తగ్గింది. ఎగువ ప్రాంతం నుంచి జూరాలకు వరదనీరు పూర్తిగా తగ్గడంతో జూరాల నుంచి ఎగువ ప్రాంతానికి నీటి విడుదల నిలిపివేశారు. దీంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే పుష్కర స్నానాలకు ఒకేరోజు మిగిలి ఉండటంతో నీటి మట్టం తగ్గినా స్నానాలకు ఇబ్బందిలేదని అధికారులు చెబుతున్నారు. పుష్కరాల ముగింపు పర్వాన్ని బీచుపల్లి పుష్కరఘాట్లో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డితోపాటు జిల్లా మంత్రులు, ఇతర అధికారులు మంగళవారం సాయంత్రం జరిగే ముగింపు సభలో పాల్గొననున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement