ఐటీఐ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులంతా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ డిప్యూటీ డైరక్టర్ (విశాఖపట్నం) ఎం.గురునాథేశ్వరరావు సూచించారు. ప్రభుత్వ ఐటీఐ, డీఎల్టీసీ కార్యాలయంలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ అప్రంటీష్ షిప్ ట్రైనింగ్ అధికారి పి.ప్రేమ్చంద్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ఉద్దేశాలను వివరించారు.
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
Sep 29 2016 11:24 PM | Updated on Sep 4 2017 3:31 PM
శ్రీకాకుళం: ఐటీఐ చదువుతున్న, పూర్తిచేసిన విద్యార్థులంతా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ డిప్యూటీ డైరక్టర్ (విశాఖపట్నం) ఎం.గురునాథేశ్వరరావు సూచించారు. ప్రభుత్వ ఐటీఐ, డీఎల్టీసీ కార్యాలయంలో గురువారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ అప్రంటీష్ షిప్ ట్రైనింగ్ అధికారి పి.ప్రేమ్చంద్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల ఉద్దేశాలను వివరించారు. నైపుణ్యవంతమైన దేశంగా పేరు తీసుకురావాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు. సదస్సులో రీజనల్ ఎంప్లాయిమెంట్ అధికారి ఎ.ఉమాదేవి, జిల్లా ఉపాధి కల్పన శాఖాధికారి కె.కామేశ్వరరావు, కన్వీనర్ ఆర్.కైలాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ ఎస్.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement