ఆజాద్నగర్కు చెందిన యువతిని ఇదే కాలనీకి చెందిన ఓ యువకుడు కిడ్నాప్ చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అనంతపురం సెంట్రల్ : ఆజాద్నగర్కు చెందిన యువతిని ఇదే కాలనీకి చెందిన ఓ యువకుడు కిడ్నాప్ చేశాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం నాలుగో పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంటర్ చదువుతున్న తమ కుమార్తెను ఆ యువకుడు ప్రేమిస్తున్నానని వెంటపడేవాడని, గతంలో పెద్దలు పంచాయితీ చేసి హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్ఐ శ్రీరామ్ కేసు నమోదు చేసుకున్నారు.