కొత్త బ్రిడ్జి వరకు బస్సులు నడపాలి | bussing running to new bridge | Sakshi
Sakshi News home page

కొత్త బ్రిడ్జి వరకు బస్సులు నడపాలి

Aug 17 2016 9:50 PM | Updated on Sep 4 2017 9:41 AM

కొత్త బ్రిడ్జి వరకు బస్సులు నడపాలి

కొత్త బ్రిడ్జి వరకు బస్సులు నడపాలి

నాగార్జునసాగర్‌ : పుష్కర భక్తుల సౌకర్యార్థం కొత్తబ్రిడ్జి వరకు ఉచిత బస్సులు వెళ్లేలా చూడాలని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు.

నాగార్జునసాగర్‌ : పుష్కర భక్తుల సౌకర్యార్థం కొత్తబ్రిడ్జి వరకు ఉచిత బస్సులు వెళ్లేలా చూడాలని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పోలీస్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగార్జునసాగర్‌లోని శివాలయం, సురికివీరాంజనేయ స్వామి ఘాట్లను సందర్శించారు. భక్తులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్న ఎస్పీ పైవిధంగా స్పందించారు. వెంటనే సాగర్‌ భద్రతను పరిశీలించే డీస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఘాట్లలోని అధికారులతో కలిసి కోఆర్డినేషన్‌ మీటింగులు జరపాలన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement