బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించిన స్టూడెంట్ ప్లాన్ గడువు ఈనెల 15న ముగియనుంది.
అనంతపురం రూరల్ : బీఎస్ఎన్ఎల్ సంస్థ ప్రకటించిన స్టూడెంట్ ప్లాన్ గడువు ఈనెల 15న ముగియనుంది. అయితే బీఎస్ఎన్ఎల్ వినియోగదారులను ఆకట్టుకునేందుకు స్టూడెంట్ ప్లాన్ను 2017 మార్చి వరకు గడువు పొడిగించినట్లు సంస్థ డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ తెలిపారు.
ఈ ఆఫర్ రూ.118 ఎఫ్ఆర్సీతో రీచార్జ్ చేయించుకుంటే బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ నిమిషానికి 10 పైసలు, ఇతర నెట్ వర్క్లకు 30 పైసలు, వీటితో పాటు 1జీబీ డేటా కూడా ఉచితంగా అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.