రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్.. | Blade Batch Halchal In Rajahmundry | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ హల్చల్..

Apr 14 2016 10:23 AM | Updated on Apr 3 2019 3:50 PM

తూర్పుగోదావరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది.

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున బ్లేడ్ బ్యాచ్ వీరంగం సృష్టించింది. రాజమండ్రి దివాస్ చెరువు 4వ వంతెన వద్ద ఆటోలో వెళ్తున్న ప్రయాణికులను బెదిరించి దాడికి తెగబడింది.

ఈ దాడిలో పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారి నుంచి నగలు, నగదును బ్లేడ్ బ్యాచ్ దోచుకెళ్లారు. గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement