నకిలీ బిస్కెట్‌ తయారీ కంపెనీపై దాడి | Biscuit manufacturing company in fake attack | Sakshi
Sakshi News home page

నకిలీ బిస్కెట్‌ తయారీ కంపెనీపై దాడి

Sep 24 2016 12:19 AM | Updated on Sep 4 2017 2:40 PM

బ్రాండెడ్‌ పేరుతో నకిలీ బిస్కెట్లు తయారు చేస్తున్న కంపెనీపై దాడి చేసి యంత్రాలు, బ్రాండెడ్‌ లేబుళ్లు సీజ్‌ చేసినట్లు ధర్మసాగర్‌ ఎస్సై కుమారస్వామి తెలిపారు.

రాంపూర్‌ (ధర్మసాగర్‌) : బ్రాండెడ్‌ పేరుతో నకిలీ బిస్కెట్లు తయారు చేస్తున్న కంపెనీపై దాడి చేసి యంత్రాలు, బ్రాండెడ్‌ లేబుళ్లు సీజ్‌ చేసినట్లు ధర్మసాగర్‌ ఎస్సై కుమారస్వామి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్‌ కరాచీ బేకరీ బ్రాండెడ్‌ బిస్కెట్లను రాంపూర్‌లో నకిలీగా తయారు చేస్తున్నారన్నారు. ఆ కంపెనీకి చెందిన వాటాదారుడి ఫిర్యాదుతో రాంపూర్‌ ఇండసీ్ట్రయల్‌లోని ఓ కంపెనీపై దాడి చేసి కరాచీ బేకరీ బ్రాండెడ్‌ పేరుతో నకిలీ రేపర్లు, అట్టపెట్టలు, యంత్రసామగ్రి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు  ఆయన తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement