మహిళా కండక్టర్‌పై దౌర్జన్యం | attack on lady conducter | Sakshi
Sakshi News home page

మహిళా కండక్టర్‌పై దౌర్జన్యం

Nov 17 2016 2:04 AM | Updated on Nov 9 2018 5:02 PM

జంగారెడ్డిగూడెం : మహిళా కండక్టర్‌పై దౌర్జన్యం చేసి కొట్టిన ఓ విద్యార్థిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి..

జంగారెడ్డిగూడెం :  మహిళా కండక్టర్‌పై దౌర్జన్యం చేసి కొట్టిన ఓ విద్యార్థిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎం.కేశవరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.. ఆర్టీసీ డిపోలో ఎం.వసంతకుమారి కండక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె బుధవారం  సాయంత్రం జంగారెడ్డిగూడెం నుంచి రాజమండ్రి వెళ్లే బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్న పితాని ప్రసాద్‌ అనే విద్యార్థి బస్సు ఎక్కాడు. బయ్యనగూడానికి టికెట్‌ ఇమ్మని ఆమెను అడిగాడు. అదే సమయంలో బస్సు కదలడం, మలుపు రావడంతో డ్రైవర్‌కు వసంతకుమారి సూచనలిస్తున్నారు. అయితే టికెట్‌ అడిగిన వెంటనే ఇవ్వలేదని ప్రసాద్‌ కండక్టర్‌పై దౌర్జన్యం చేయడమే కాకుండా చేయి చేసుకున్నాడు. కండక్టర్‌ వసంతకుమారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement