పదోన్నతుల కౌన్సెలింగ్‌లో వాగ్వాదం | altercation in promotions counseling | Sakshi
Sakshi News home page

పదోన్నతుల కౌన్సెలింగ్‌లో వాగ్వాదం

Jul 4 2017 10:42 PM | Updated on Sep 5 2017 3:12 PM

ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌)లకు చేపట్టిన పదోన్నతుల కౌన్సెలింగ్‌పై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు.

 వైద్య ఆరోగ్యశాఖ ఆర్డీ కార్యాలయంలో గందరగోళం

కడప రూరల్‌ : ఎంపీహెచ్‌ఏ(ఎఫ్‌)లకు చేపట్టిన పదోన్నతుల కౌన్సెలింగ్‌పై ఉద్యోగులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకానొక సందర్భంలో అధికారులతో వాగ్వాదానికి దిగారు. కడప పాత రిమ్స్‌లోని వైద్య ఆరోగ్యశాఖ రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం ఈ శాఖ పరిధిలోని వైఎస్సార్‌ జిల్లాతోపాటు చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల ఉద్యోగులకు సంబంధించిన పదోన్నతులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఎంపీహెచ్‌ఏ (ఎఫ్‌) నుంచి ఎంపీహెచ్‌ఎస్‌గా పదోన్నతులు కల్పించారు. ఈ క్యాడర్‌లో 86మందికి పదోన్నతి లభించింది. అలాగే హెల్త్‌ ఎడ్యుకేటర్స్‌గా పదోన్నతులకు ఏడుగురికిగాను ఆరుగురికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇందుకు సంబంధించి ఒక ఉద్యోగినికి ఒకచోట పోస్టింగ్‌ ఇచ్చి రిజిష్టర్‌లో సంతకం కూడా తీసుకున్నారు. తర్వాత ఆమెకు మరోచోటికి పోస్టింగ్‌ ఇవ్వడంతో ఆ ఉద్యోగిని నిర్ఘాంతపోయింది. ఇదేమని ప్రశ్నించినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదు. ఇలా పలువురికి జరగడంతో ఉద్యోగులు బహిరంగంగానే ఆరోపణలకు దిగారు. కార్యాలయ సిబ్బంది తమకు అనుకూలమైన వారికి అనుకున్నచోటికి పోస్టింగ్‌ ఇచ్చారని వారంతా మండిపడ్డారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement