ఆల్‌టైం మందుల మిషన్‌ ప్రారంభం | all time medicine machine starts | Sakshi
Sakshi News home page

ఆల్‌టైం మందుల మిషన్‌ ప్రారంభం

Oct 30 2016 1:34 AM | Updated on Oct 16 2018 3:26 PM

ఆల్‌ టైం మందుల పంపిణీ మిషన్‌ను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యుగంధర్‌ తెలిపారు.

ధర్మవరం రూరల్‌ : ఆల్‌ టైం మందుల పంపిణీ మిషన్‌ను రోగులు సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ యుగంధర్‌ తెలిపారు.    శనివారం మండల పరిధిలోని దర్శనమల పీహెచ్‌సీలో ఈ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైద్యులు అందుబాటులో లేని సమయంలో ఏఎన్‌ఎంల సహాయంతో బటన్‌ నొక్కి రోగులు మందులను తీసుకెళ్లవచ్చన్నారు. నంబర్ల ఆధారంగా ఏ మందులు కావాలో వాటికి సంబంధించిన నంబర్లు నొక్కితే మందులు బయటకు వస్తాయన్నారు. జిల్లాలో రాయదుర్గం నియోజవర్గంలోని నాగలాపురం, దర్శనమల పీహెచ్‌సీలో మిషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. డాక్టర్‌ చెన్నారెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement