ప్రశాంతంగా ఐసెట్
భీమవరం: పట్టణంలోని ఎస్ఆర్కేఆర్, శ్రీవిష్ణు, డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాలల్లో సోమవారం ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మూడు కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించారు. మొత్తం 800 మందికి గాను 51 మంది గైర్హాజరయ్యారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 150 మందికి 142 మంది, మధ్యాహ్నం 150 మందికి 142 మంది హాజరయ్యారు. శ్రీవిష్ణు కళాశాలలో ఉదయం 100 మందికి 95 మంది, మధ్యాహ్నం 100 మందికి 88 మంది హాజరయ్యారు. డీఎన్నార్ కళాశాలలో ఉదయం 150 మందికి 144 మంది, మధ్యాహ్నం 150 మందికి 138 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పరీక్షలు ప్రశాంతం జరిగాయి.
కాపులకు మేలు చేసింది సీఎం జగనే పాలకొల్లు అర్బన్: రాష్ట్రంలో తెలగ, బలిజ, కాపు, ఒంటరి కులాలకు సీఎం జగన్ మోహన్రెడ్డి ఒక్కరే మేలు చేశారని యునైటెడ్ కాపు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి ఉనికెల శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పాలకొల్లు మండలం పూలపల్లిలో ఆయన సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల, ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు (గోపి)కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాపులకు మేలు చేసే విధంగా కాపు నేస్తం పథకాన్ని కొనసాగిస్తూ 2024 మేనిఫెస్టోలో సీఎం జగన్ హామీ ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని కాపు సామాజిక వర్గీయులంతా సీఎం జగన్కి అండగా నిలవాలని కోరారు. సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగించేలా ఐదేళ్లు పనిచేసిన సీఎం జగన్ ప్రజల హృదయాల్లో నిలిచారన్నారు.
పసుపు చొక్కాతో నిమ్మల ప్రచారం పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులోని ఎన్నికల ఫెసిలిటేషన్ కేంద్రం వద్ద పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులతో పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పచ్చ చొక్కా వేసుకుని వచ్చి మాట్లాడటంపై వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ఎంఎంకేఎన్ మున్సిపల్ హైస్కూల్లో సోమవారం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కోసం ఐదు బూత్లను ఏర్పాటుచేశారు. ఇక్క డ ఓటింగ్ సరళిని పరిశీలించడానికి పచ్చ చొక్కా వేసుకుని వచ్చిన ఎమ్మెల్యే నిమ్మలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఆయన ప్రవర్తించారని అంటున్నారు. 20 రోజులు.. రూ.1.87 కోట్లు
చిన వెంకన్న హుండీ ఆదాయం లెక్కింపు
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో సోమవారం లెక్కించారు. శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 20 రోజులకు గాను నగదు రూపేణా రూ.1,87,54,150 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. కానుకల రూపంలో 241 గ్రాముల బంగారం, 6.410 కేజీల వెండితో పాటు విదేశీ కరెన్సీ యుఎస్ఏ, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్ డాలర్లు 56, ఇంగ్లాండ్ పౌండ్స్ 2, అరబ్ ఎమిరటీస్ థీరమ్స్ 5, సౌదీ అరేబియన్ రియాల్స్ 4, కువైట్ దినార్ 1 లభించా యన్నారు. అలాగే రద్దయిన పాత రూ.2 వేలు, రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.31,500 లభించాయన్నారు. ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.