రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు

Published Tue, May 23 2017 7:39 PM

రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి గాయాలు - Sakshi

త్రిపురాంతకం: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు వైఎస్సార్‌ జిల్లా వాసులకు గాయాలయ్యాయి. కర్నూలు– గుంటూ రు జాతీయ రహదారిపై త్రిపురాంతకం మండలంలోని ఉమ్మడివరం సమీపంలో సోమవారం ఈ ప్రమాదం జరిగింది. వైఎస్సార్‌ జిల్లా దువ్వూరు మండలం ముదిరేపల్లికి చెందిన వారు గుంటూరు జిల్లా నరసరావుపేట ప్రాంతంలోని కోటప్పకొండకు మొక్కు తీర్చుకునేందుకు తుఫాన్‌ వాహనంలో వెళ్తున్నారు.

స్పీడ్‌బ్రేకర్‌ వద్ద ఓ లారీ స్లో కావడంతో వెనుక వేగంగా వస్తున్న వీరి తుఫాన్‌ వాహనం ఢీకొట్టింది. దానిలోని గువ్వల లింగా రెడ్డి, జ్యోత్స్న, సావిత్రి, టి.శివారెడ్డి, సుహాసిని, హమీర్‌బాషా, మరొకరు గాయపడ్డారు. వీరిని వినుకొండలోని వైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement