ఏఈ పరీక్షలకు 63.66 శాతం హాజరు | 63.66% attendance recorded for AE posts in AP | Sakshi
Sakshi News home page

ఏఈ పరీక్షలకు 63.66 శాతం హాజరు

Published Sun, Nov 6 2016 8:18 PM | Last Updated on Sat, Jun 2 2018 2:56 PM

అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు ఆదివారం ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది.

విజయవాడ: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులకు ఆదివారం ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. విజయవాడలో 19 కేంద్రాల్లో ఈ పరీక్షలకు 63.66శాతం మంది హాజరయ్యారు. 

విజయవాడ నుంచి 8,787మంది పరీక్షలకు హాజరుకావాల్సి ఉండగా, 5,594మంది అభ్యర్ధులు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ బాబు తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తుగా 144వ సెక్షన్ విధించినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement