'ప్లాన్ ప్రకారమే తుని ఘటన జరిగిందనిపిస్తోంది' | 5 thousand crpf, rapid action force deployed in east godavari, says adg thakur | Sakshi
Sakshi News home page

'ప్లాన్ ప్రకారమే తుని ఘటన జరిగిందనిపిస్తోంది'

Feb 1 2016 2:46 PM | Updated on Sep 3 2017 4:46 PM

'ప్లాన్ ప్రకారమే తుని ఘటన జరిగిందనిపిస్తోంది'

'ప్లాన్ ప్రకారమే తుని ఘటన జరిగిందనిపిస్తోంది'

తూర్పుగోదావరి జిల్లా తునిలో హింసాత్మక ఘటన పథకం ప్రకారమే జరిగిందనిపిస్తోందని అడిషనల్ డీజీ ఠాకూర్ చెప్పారు.

తుని: తూర్పుగోదావరి జిల్లా తునిలో హింసాత్మక ఘటన పథకం ప్రకారమే జరిగిందనిపిస్తోందని అడిషనల్ డీజీ ఠాకూర్ అన్నారు. జిల్లాలో ఐదు వేలమంది సీఆర్పీఎఫ్‌, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించినట్టు తెలిపారు.

ఆదివారం తునిలో కాపుల ఆందోళన సందర్భంగా పోలీసులు సంయమనం పాటించారని అడిషనల్ డీజీ చెప్పారు. తుని ఘటనలో 15 మంది పోలీసులకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటన వెనుక నిఘా వైఫల్యం లేదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రైలు ప్రయాణికులను పోలీసులు కాపాడారని, లేదంటే ప్రాణనష్టం జరిగేదని ఠాకూర్ వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement