ఖమ్మం: వేగంగా వెళ్తున్న కారు బోల్తా కొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి ఖమ్మం వైపు వస్తుండగా.. మద్దులపల్లి వద్ద కారు ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఇది గుర్తించిన స్థానికులు ఐదుగురిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరంతా హైదరాబాద్కు చెందిన వారిగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
కారు బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు
Published Wed, Apr 19 2017 8:01 AM
# Tag
Related news
-
Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
విశాఖపట్నం : వారు ప్రయాణిస్తున్న కారు యమదూతలా మారింది.. టైరు రూపంలో యమపాశం విసిరింది.. జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం వద్ద జరిగిన ఘోర ప్రమాదం రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు హరించింది. రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. వివరాలివి. జీవీఎంసీ 91వ వార్డు గవరవీధి, ఎన్ఏడీ జంక్షన్, కూర్మనపాలెం ప్రాంతాలకు చెందిన నలుగురు కారులో శనివారం ఉదయం కాకినాడ బయలు దేరారు. శరగడం వెంకటలక్ష్మి (37) తన కొడుకు వికాస్, మేనమామ కొడుకు దాడి గగన్ (15)లతో కలిసి వ్యక్తిగత పనిమీద కారులో ప్రయాణమయ్యారు. వీరితో పాటు వికాస్ స్నేహితుడైన సుంకర మధుకర్(27) బయలుదేరాడు.పాయకరావుపేటలో వెంకటలక్ష్మి తల్లిని చూసి అక్కడ నుంచి కాకినాడ వెళ్లాలనుకున్నారు. కారు వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు చేరుకునే సరికి హఠాత్తుగా టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి అవతల రూట్లోకి దూసుకుపోయింది. తుని నుంచి విశాఖ వైపు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. ఈ ఘటనలో కారులో ఉన్న వెంకటలక్ష్మి, దాడి గగన్, సుంకర మధుకర్ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద తీవ్రతకు కారు టాప్ పైకి లేచిపోయింది. డోర్లు ఊడిపోయాయి. ప్రమాదంలో వికాస్ ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు నెలల్లో జర్మనీ వెళ్లాల్సి ఉండగా.... వికాస్ స్నేహితుడైన మధుకర్ విశాఖ స్టీల్ప్టాంట్లో మెకానికల్ విభాగంలో అప్రెంటీస్ చేస్తున్నట్టు తెలిసింది. తుని ప్రాంతానికి చెందిన అతడు ఎన్ఏడీ జంక్షన్లో ఉంటున్నాడు. అతడు రెండు నెలల్లో ఉన్నత చదువు, ఉద్యోగం కోసం జర్మనీ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలోనే మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించి అనంత లోకాలకు తీసుకెళ్లిపోయింది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నక్కపల్లి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు దుర్మరణం పాలవడంతో విషయం తెలుసుకున్న బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్దలానికి చేరుకుని రోదించారు. కారులో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీసి పోస్టుమార్టం కోసం నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ విజయ్కుమార్ తెలిపారు.గవరవీధిలో విషాదఛాయలు గోపాలపట్నం: వెదుళ్లపాలెం జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదంలో శరగడం వెంకటలక్ష్మి మృతి చెందగా ఆమె కుమారుడు వికాస్ గాయాలపాలవడంతో గవరవీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. గవరవీధిలో ఉంటున్న శరగడం నర్సింగరావు సప్లయర్ దుకాణం నిర్వహిస్తున్నాడు. రోడ్డు ప్రమాదంలో అతడి భార్య వెంకటలక్ష్మి మృతి చెందగా కుమారుడు వికాస్ గాయాలపాలయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు, స్థానికులు పెద్ద ఎత్తున ఇంటికి తరలివచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వెంకటలక్ష్మి ఎప్పుడు నవ్వుతూ నవి్వస్తూ అందరితో కలివిడిగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ప్రమాదంలో మృతి చెందిన దాడి గగన్ది కూర్మన్నపాలెం కాగా.. శనివారం ఉదయం టోల్గేట్ వద్ద కారు ఎక్కాడు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం
హైదరాబాద్: అమ్మా.. నేను సెలవులకు పిన్ని వాళ్ల ఇంటికి వెళ్తున్నా.. రేపు స్కూల్లో ప్రోగ్రెస్ కార్డు ఇస్తారు.. నువ్వు, నాన్న వెళ్లి తీసుకోండి.. అని చెప్పి సోదరుడితో కలిసి బైక్పై బయలుదేరిన కొద్దిసేపటికే ఓ బాలికను బస్సు రూపంలో మృత్యువు కాటేసింది. ఈ హృదయవిదారక ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఖమ్మం జిల్లా, భోనకల్లు మండలం, నారాయణపురం గ్రామానికి చెందిన గురవయ్య, తిరుపతమ్మ దంపతులు రహమత్నగర్లో ఉంటున్నారు. గురవయ్య జూబ్లీహిల్స్ చట్నీస్ చౌరస్తాలో కొబ్బరి బొండాల వ్యాపారం చేసేవాడు. ఆయన కుమార్తె దుడ్డు శిరీష(15) ఇటీవలే తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. బుధవారం నుంచి సెలవులు ఇవ్వడంతో సోదరుడు గోపితో కలిసి మంగళవారం రాత్రి ఫిలింనగర్లో ఉంటున్న పిన్ని ఇంటికి బయలుదేరింది. యూసుఫ్గూడ మీదుగా వెళుతుండగా రోడ్డుపై ఆగి ఉన్న ఆర్టీసీ బస్సు పక్క నుంచి వెళ్లే క్రమంలో బస్సు వెనుక డోర్ శిరీష ముఖానికి తగలడంతో కిందడపడింది. ఆమె తలకు, ముఖానికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందింది. గోపీ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటనతో గురవయ్య కుటుంబంలో విషాదం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రోడ్డుకు ఒక పక్క బైక్ ఆపి ఉందని, మరో పక్క బస్సు ఆగి ఉండగా, ఈ రెండింటి మధ్య నుంచి గోపీ బైక్ వెళ్లడంతో ప్రమాదవశాత్తు బస్సు వెనుక డోర్ తలకు గీసుకుపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లుగా పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిర్ధారించారు. ఒక్కగానొక్క కూతురు కన్నుమూయడంతో గురవయ్య, తిరుపతమ్మ దంపతులు ఠాణా ఆవరణలోనే కుప్పకూలిపోయారు. ప్రోగ్రెస్ కార్డు తీసుకోండంటూ చెప్పిన కొద్దిసేపటికే బిడ్డ మరణవార్త వినాల్సి వస్తుందని అనుకోలేదని తండ్రి బోరున విలపించాడు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
సూర్యాపేటలో యాక్సిడెంట్.. ఆరుగురి దుర్మరణం
సూర్యాపేట, సాక్షి: తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి నెత్తురోడింది. కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆగి ఉన్న లారీని వెనక నుంచి కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరుగురు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వాళ్ల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. లారీ బ్రేక్ డౌన్ కావడంతో డ్రైవర్ దానిని రోడ్డు పక్కగా నిలిపాడు. అయితే కారును వేగంగా నడుపుతున్న వ్యక్తి ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసే క్రమంలో గమనించకుండా లారీని ఢీ కొట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాదం ధాటికి కారు లారీ కిందకు వెళ్లిపోయింది. ఇరుక్కుపోయిన వాహనాన్ని స్థానికుల సాయంతో పోలీసులు బయటకు తీశారు. ఆ తర్వాతే మృతదేహాలను, క్షతగాత్రులను తరలించారు. మృతుల వివరాలుకారులో ప్రయాణిస్తున్నవాళ్లంతా ఒకే కుటుంబానికి చెందిన వాళ్లుగా తెలుస్తోంది. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ఎల్ గోవిందాపురం గ్రామానికి చెందినవాళ్లని పోలీసులు గుర్తించారు. విజయవాడ గుణదలకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. మాణిక్యంస్వర్ణచందర్ రావుకృష్టంరాజులాస్యశ్రీకాంత్ఇదిలా ఉంటే..రెండ్రోజుల కిందట ఇదే తరహాలో మునగాల మండలం ముకుందాపురం వద్ద ఘోరం జరిగింది. ఆగి ఉన్న కారును వేగంగా ఢీ కొట్టింది ఓ కారు. ఈ ప్రమాదంలో అందులో ఉన్న యువ దంపతులు అక్కడికక్కడే మరణించారు. -
ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ 3 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రింగ్ రోడ్డుపైన ప్రయాణిస్తున్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. ఒక్కసారిగా అకస్మాత్తుగా చెలరేగిన మంటలు చెలరేగాయి. మంటల్లో కారు పూర్తిగా దగ్ధం కాగా.. లారీకి మంటలు అంటుకున్నాయి. కారులో ఇద్దరూ సజీవ దహనం అయినట్టు సమాచారం.దీంతో మేడ్చల్ నుండి శంషాబాద్ వెళ్లే ఓఆర్ఆర్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. పూర్తిగా దగ్దమైన కారు, కారు నెంబర్ ద్వారా గుర్తించే పనిలో పోలీసులు పరిశీలిస్తున్నారు. -
Banjarahills: బంజారాహిల్స్లో బెంజ్ కారు బీభత్సం...
హైదరాబాద్: అదుపు తప్పిన వేగంతో వచ్చిన బెంజ్ కారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్పైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు.. అమెరికాలో నివసించే అయిదుగురు యువతీ యువకులు ఓ వివాహానికి హాజరయ్యేందుకు నాలుగు రోజుల క్రితం నగరానికి వచ్చారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లో నివసించే వెంకటష్, అవినాష్తో పాటు జర్మనీ, అమెరికాలో నివసించే మ్యాక్స్మిలన్ హెన్రీ, ప్రీతమ్, ఓ యువతి బంజారాహిల్స్లోని పార్క్ హయత్ హోటల్లో బస చేశారు.మంగళవారం రాత్రి వీరు బెంజ్ కారులో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్–45లోని దస్పల్లా హోటల్ పైన ఉన్న కారా పబ్కు వెళ్లారు. మద్యం తాగిన అనంతరం అర్ధరాత్రి కారులో మాదాపూర్,గచ్చిబౌలి, దుర్గంచెరువు ప్రాంతాలను చుట్టేసి పార్క్ హయత్ హోటల్ వైపు వెళ్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10/36 శ్రీజ్యువెలర్స్ వద్ద వీరు వెళ్తున్న కారు అదుపుతప్పి అంతే వేగంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పైకి దూసుకెళ్లింది. కాగా.. ఇందులోని అయిదుగురు యువతీ యువకులు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్టేషన్కు తరలించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా కారు నడుపుతున్న వెంకటేష్ 44 ఎంజీ, అవినాష్ 173 ఎంజీతో పాటు మిగతావారు కూడా మద్యం తాగినట్లు గుర్తించారు. జూబ్లీహిల్స్కు చెందిన చలసాని మాధవీదేవి పేరుతో కారు రిజిస్టరై ఉందని పోలీసులు గుర్తించారు. ఓ పెళ్లికి హాజరుకావడానికి వీరంతా నగరానికి వచ్చినట్లు తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు కారును సీజ్ చేసి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
Related News by category
-
అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలి
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన జీపీల ప్రత్యేక అధికారులతో సమావేశమై పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీఓఇంచచారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షిస్తుండడంతో పాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మిషన్ భగీరథ సరఫరా లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ప్రైవేట్ వనరులను లీజ్కు తీసుకోవాలన్నారు. అలాగే, నర్సరీలు, విద్యుద్దీపాలు, అంతర్గత రహదారుల నిర్వహణపై దృష్టి సారించాలని, సకాలంలో పన్నులు వసూలు చేయడమే కాక ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఈసమీక్షలో జెడ్పీ సీఈఓ వినోద్, డీఆర్డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు. ఏకలవ్య మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి పరీక్ష భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ ప్రభుత్వ ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలుకల్పించేందుకు ఈనెల 28న పరీక్ష నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ తెలిపారు. ఈనెల 28న ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు పరీక్ష ఉంటుందని పేర్నొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https:// tsemrs. telangana. gov. in వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు భద్రాద్రి జిల్లాలో మూడు, ఖమ్మం జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసినట్లు పీఓ తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందించాలి వైరా: వైరా రిజర్వాయర్ వద్ద సక్రమంగా క్లోరినేషన్ చేయడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి ఆదేశించారు. వైరా రిజర్వాయర్ గుట్టపై బోడేపూడి సుజల స్రవంతి పథకం, మిషన్ భగీరథ ఇన్ టేక్వెల్ ప్రాంతాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఇటీవల రిజర్వాయర్ నుంచి రంగు మారిన నీరు సరఫరా అవుతుందనే ప్రచారంతో పరిశీలించిన ఆయన వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి నిల్వలు, క్లోరినేషన్ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కు చేరుతున్న నేపథ్యాన నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఈ కె.శ్రీనివాస్, ఎస్ఈ సదాశివకుమార్, ఈఈలు వాణిశ్రీ, పుష్పలత, డీఈ నర్సింహమూర్తి, ఏఈ మణిశంకర్ పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు తల్లాడ ప్రమాదంపై ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆగ్రహం ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని తల్లాడ సబ్స్టేషన్లో ఆదివారం ట్రాన్స్ఫార్మర్ పేలగా లైన్మెన్గా గాయాలయ్యాయి. ఈ నేపథ్యాన సీఎండీ సోమవారం ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. ఉద్యోగులు, సిబ్బంది విధినిర్వహణలో నిబంధనలు పాటించాలని, పనిప్రాంతంలో గ్లౌజ్లు, హెల్మెట్ విధిగా ధరించాలని సూచించారు. తల్లాడ సబ్స్టేషన్లో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న సీఎండీ.. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూనే విధిగా భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. -
గులాబీకి సవాల్..
ఖమ్మం లోక్సభ ఎన్నిక బీఆర్ఎస్కు సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించడం ఎదురీతకు కారణమవుతోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో నెలకొంది. ఇక్కడ విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సర్వశక్తులొడ్డుతున్నా ఫలితం ఎలా ఉండబోతోందన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంనాడు అధికారంలో.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. దీంతో 1,68,065 ఓట్ల మెజార్టీతో నామ విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నాడు 14.74 శాతం ఓట్ల వ్యత్యాసం వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ పరిధి ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు 5,18,194 ఓట్లు వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో నామాకు 49,265 ఓట్లు మాత్రమే అదనంగా నమోదయ్యాయి. ఇప్పుడు భారీ వ్యత్యాసం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. ఖమ్మం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్తో పాటు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థులకు 7,33,293 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు 4,67,639 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తద్వారా కాంగ్రెస్ కూటమి 2,65,654 ఓట్ల మెజార్టీని సాధించినట్లయింది. ఈ గణాంకాలను పరిశీలిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో కూడా లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది. ఖమ్మం లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ ఎదురీత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మెజార్టీ ఓట్లు ఆ పార్టీతో పోలిస్తే ‘కారు’కు 2.65 లక్షల ఓట్ల వ్యత్యాసం ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎటువైపోనని ఉత్కంఠపట్టు దొరికేది ఎక్కడ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖమ్మం నియోజకవర్గంలో 49,381 ఓట్ల మెజార్టీ, పాలేరులో 56,650 మెజార్టీ, సత్తుపల్లిలో 19,440 ఓట్లు, మధిరలో 35,452 ఓట్ల మెజార్టీ, వైరాలో 33,045 ఓట్లు, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి 42,781 ఓట్ల మెజార్టీ, అశ్వారావుపేటలో 28,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడా కూడా బీఆర్ఎస్ అభ్య ర్థులు కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేక పోయారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీ రావడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ పరిధిలో ఎలా ఓట్లు దక్కించుకోవాలి, ఎక్కడ పట్టు దొరుకుతుందనే లెక్కల్లో బీఆర్ఎస్ నేతలు మునిగితేలుతున్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు.. నియోజకవర్గం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖమ్మం 1,36,016 86,635 పాలేరు 1,27,820 71,170 సత్తుపల్లి 1,11,245 91,805 మధిర 1,08,970 73,518 వైరా 93,913 60,868 కొత్తగూడెం (సీపీఐ) 80,336 37,555 అశ్వారావుపేట 74,993 46,088 మొత్తం 7,33,293 4,67,639 -
బాలారిష్టాలు దాటని హబ్
ఖమ్మం వైద్యవిభాగం: ఖమ్మంలో ఏర్పాటుచేసిన డయాగ్నస్టిక్ హబ్లో రకరకాల కొరతతో తరచూ పరీక్షలు నిలిచిపోతున్నాయి. రసాయనాల కొరత, యంత్రాల్లో లోపాలతో ఏ రోజు ఏ పరీక్ష ఉంటుందో సిబ్బందికే తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వివిధ ప్రాంతాల నుంచి శాంపిళ్లు తీసుకొస్తున్నా లక్ష్యం మేరకు పరీక్షలు జరగడం లేదు. ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో మూడేళ్ల క్రితం తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ నెలకొల్పారు. తొలుత 57 రకాల పరీక్షలు నిర్వహించగా క్రమంగా వాటి సంఖ్య పెంచడంతో ప్రస్తుతం 134 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ కొంత కాలంగా టెస్టులకు రసాయనాల సరఫరా సక్రమంగా లేకపోవడంతో అన్ని పరీక్షలు జరగడం లేదు. ఇటీవల రసాయనాల సరఫరా పూర్తిగా నిలిచిపోగా కొన్ని రోజుల పాటు పరీక్షలే నిలిచిపోయాయి. దీంతో అధికారులు మహబూబాబాద్, వరంగల్ ఆస్పత్రుల నుంచిరసాయనాలు తెప్పించి పని కానిచ్చేశారు. ఇదే పరిస్థితి తరచుగా ఎదురవుతుండడంతో అవసరమైన పరీక్షలు జరగక సామాన్యులు మళ్లీ ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. తొలినాళ్లలో మంచి స్పందన డయాగ్నస్టిక్ హబ్కు తొలి నాళ్లలో మంచి స్పందన లభించింది. అప్పట్లో 57 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చారు. అనంతరం అదనంగా మరో 77 రకాల పరీక్షలను గత ఏడాది ప్రభుత్వం చేర్చింది. ఇలా 134రకాల పరీక్షలు చేయాల్సి ఉన్నా ఖమ్మం హబ్లో సగానికి కంటే తక్కువ పరీక్షలే జరుగుతున్నాయి. తరచూ రసాయనాల కొరత, సిబ్బంది అందుబాటులో లేకపోవడం, యంత్రాల మరమ్మతులు వంటి కారణాలతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. సాధారణంగా హబ్లో ప్రతీ గంటకు 1,520 పరీక్షలు చేస్తారు. ఇందులో కెమిస్ట్రీ అనలైజర్ మిషన్ ద్వారా 1,200, ఇమ్యునో అనలైజర్ మిషన్ ద్వారా 220, సీబీపీ మిషన్ ద్వారా గంటకు వంద పరీక్షలు చేయాల్సి ఉన్నా ఆ స్థాయిలో జరగడంలేదు. 45 ఆస్పత్రుల నుండి శాంపిళ్లు జిల్లాలోని 45 ప్రభుత్వ ఆస్పత్రుల నుండి ఖమ్మం పెద్దాస్పత్రిలోని డయాగ్నస్టిక్ హబ్కు నిత్యం శాంపిల్స్ వస్తుంటాయి. పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానాల్లో సేకరించిన శాంపిళ్లను వాహనాల్లో ఇక్కడకు తీసుకొస్తారు. ఇందుకోసం ఐదు రూట్లలో వాహనాలు తిరుగుతుంటాయి. అనంతరం హబ్లో పరీక్షలు చేసి 24గంటల్లోగా బాధ్యుల సెల్ఫోన్కు రిపోర్టు పంపిస్తారు. కానీ కొంత కాలంగా అనుకున్న స్థాయిలో పరీక్షలు జరగకపోగా... అవసరమైన వారు ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించాల్సివస్తోంది. ప్రస్తుతం హబ్లో సీబీపీ, గర్భిణులకు నిర్వహించే కోయోగ్లేషన్ టెస్టులు, ఇతర అవసరమైన టెస్టులు అందుబాటులో లేవని సమాచారం. అన్ని పరీక్షలు జరిగేలా చర్యలు డయాగ్నస్టిక్ హబ్లో అన్ని రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. రసాయనాల కొరతతో అప్పుడప్పుడు కొంత ఏర్పడుతుండడంతో ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హబ్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు జరిగేలా చూస్తున్నాం. డాక్టర్ బి.అమర్సింగ్, ఆర్ఎంఓ, ఖమ్మం జనరల్ ఆస్పత్రి తరచుగా పరీక్షలకు అంతరాయాలు పేరుకు 134 పరీక్షలు.. అందేవి అంతంతే ఖమ్మం డయాగ్నస్టిక్ హబ్లో రసాయనాల లేమితో ఇక్కట్లు సిబ్బంది కొరత, యంత్రాల మరమ్మతులతో ఇంకొంత సమస్య -
ఉక్కపోతతో బాలింతలు, చిన్నారుల అవస్థ
ఎంసీహెచ్లో మొరాయిస్తున్న ఏసీలుఖమ్మంవైద్యవిభాగం: ప్రచండ భానుడి ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో చికిత్స పొందుతున్న బాలింతలు వేడి తట్టుకోలేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలు వార్డుల్లో ఏసీలు సరిగ్గా పనిచేయకపోవడంతో అధికారులు కొన్నిచోట్ల కూలర్లు బిగించారు. అయినా గాలి సరిపోక పలువురు ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుని వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. -
‘మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం’
● ఎంపీగా నామను గెలిపిస్తేనే అది సాధ్యం ● ప్రచార సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలిపించాలని పలువురు పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో జరిగిన ప్రచార సమావేశాల్లో అభ్యర్థి నామతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, సామాన్య ప్రజల కష్టాలు కళ్లెదుటే కనబడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా నామ గెలుపు తప్పనిసరని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించినందుకు తప్పు చేశామని భావిస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరిస్తూ నామ గెలుపునకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలను తొలగించడమే కాక హామీలను నెరవేర్చడం లేదంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా పాట రూపంలో వివరించారు. అలాగే, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ బి.ఉమ, నాయకులు తాళ్లూరి జీవన్కుమార్, బెల్లం వేణు, బాషబోయిన వీరన్న, గుడిబోయిన దర్గయ్య, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, ఏ.వరప్రసాద్, దేవరం దేవేందర్రెడ్డి, మాలతి, చావా వేణు, ఆలస్యం నాగేశ్వరరావు, రవి, చామకూరి రాజు తదితరులు పాల్గొన్నారు. ● ఖమ్మం లీగల్: బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులను కలిసి తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు బిచ్చాల తిరుమలరావు, కొత్తా వెంకటేశ్వరరావు, మేకల సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allTuesdays and Fridays Movie: వెబ్ ఫ్లిక్స్.. మూడు షరతులు
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
టైటిల్ నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో...
వాట్సప్లో మారిన రంగులు.. కారణం అదేనంటూ
బెయిర్ స్టో విధ్వంసకర సెంచరీ.. కేవలం 45 బంతుల్లోనే
లాయర్గా...
పరుగుల పంజా...
పరుగు ఇవ్వకుండానే 7 వికెట్లు
‘మిక్స్డ్’ ఫైనల్లో సురేఖ–అభిషేక్ జోడీ
చెడుపై గెలుపు
చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇదెక్కడి విధ్వంసం... కేవలం 28 బంతుల్లోనే! 8 సిక్స్లతో
Bullet List Block
- అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
- Road Accident: నక్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం
- Weekly Horoscope: ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్న విధంగా ఉంటుంది
- Today Telugu Horoscope: ఈ రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు
- జగన్ పథకాలు కాపీ కొడుతున్న టీడీపీ
- శక్తులన్నీ ఏకమయ్యాయి
- ఆ పేరే... ఒక నమ్మకం!
- Actress Sreeleela: శ్రీలీల బ్యూటిఫుల్ ఫొటోలు
- Sree Lakshmi Reddy: కలహాలు లేని కాపురం ఉండబోదు.. అంతమాత్రాన
- Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement