ఆంధ్రా-కర్ణాటకల మధ్య ఆర్టీసీ వార్! | Sakshi
Sakshi News home page

ఆంధ్రా-కర్ణాటకల మధ్య ఆర్టీసీ వార్!

Published Sun, Jan 3 2016 8:35 AM

4 karnataka bus seized, says MVI ramanareddy

అనంతపురం: ఆంధ్రప్రదేశ్-కర్ణాటక రాష్ట్రాల్లో ఆర్టీసీల మధ్య వార్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. పర్మిట్ లేకుండా ఏపీలోకి ప్రవేశించిన కర్ణాటక బస్సులను సీజ్ చేశారు. ఆర్టీసీ అధికారి మీడియాతో మాట్లాడారు. నాలుగు బస్సులను సీజ్ చేసినట్లు మోటార్ వాహనాల ఇన్స్పెక్టర్ రమణారెడ్డి వెల్లడించారు. ఇందుకు ప్రతీకారంగా గౌరీబిదనూరులో ఎనిమిది ఆర్టీసీ బస్సులను కర్ణాటక ఆర్టీసీ అధికారులు సీజ్ చేశారు. రాష్ట్ర ఆర్టీసీ బస్సుల సీజ్ విషయంపై ఏపీ అధికారులు కారణాలు తెలుసుకునేందుకు కోసం ప్రయత్నిస్తున్నారు.

Advertisement
Advertisement